Political News

కోర్ మీటింగ్ లో మోడీ చెప్పింది ఇదేనా?

ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలతో కోర్ భేటీ నిర్వహించటం తెలిసిందే. శనివారం పలు కార్యక్రమాల్లోపాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఒక పూట ముందుగా అంటే.. శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేసుకున్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావటం.. అనంతరం ఏపీ బీజేపీ నేతలతో కూడిన కోర్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.

దాదాపు గంటన్నర పాటు సాగిన బీజేపీ కోర్ కమిటి భేటీలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? కేంద్ర పార్టీ ఇచ్చే సహకారం ఏమిటి? లాంటి అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వైసీపీ సర్కారు తప్పుల లెక్క తీయాలని.. చార్జిషీట్లు వేసి పల్లెపల్లెకు చెప్పాలని స్పష్టం చేయటంతో పాటు.. తన మద్దతు రాష్ట్రానికే తప్పించి.. వ్యక్తులకు కాదని.. అవినీతి.. ఆరాచకాలను ఉపేక్షించొద్దని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ఇన్నాళ్లు రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని ఎందుకు ఎండగట్టలేదని ప్రశ్నించిన మోడీ.. అలా చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అని ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తనకు లభించిన అవకాశాన్ని సీఎం జగన్ ఖరాబు చేసుకుంటున్నారని.. దానిని మనం ఉపయోగించుకోవాలని మోడీ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. బీజేపీ మద్దతుపై వైసీపీ నేతలు ఏమైనా చెప్పుకోనివ్వండి.. మీ పని మీరు చేసుకుంటూ పొండి అంటూ మోడీ దిశానిర్దేశం చేశారు.

మీ పని మీరు చేస్తే.. అధిష్ఠానం అండగా ఉంటుందని తేల్చిన మోడీ మాటలు ఏపీ కమలనాథులకు కొత్త శక్తిని ఇవ్వటం ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా విశాఖపట్నంలోని భూకబ్జాలతో పాటు ఏపీలో నెలకొన్న పరిస్థితుల్ని ఆయన ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. జగన్ సర్కారు చేస్తున్న తప్పులపై ఎప్పటికప్పుడు చార్జిషీట్ వేసి.. పల్లె నుంచి పట్నం వరకు ప్రచారం చేయాలని మోడీ చెప్పిన తీరు చూస్తే.. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కటం ఖాయమని చెబుతున్నారు.

మోడీ చెప్పిన మాటలు.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. వైసీపీ సర్కారుపై నేరుగా యుద్ధానికి దిగాలని బీజేపీ నేతలకు మోడీ స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన మాటలతో జగన్ కు తాను దన్నుగా నిలవటం లేదని.. తప్పులు చేస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. మోడీ మాటల నేపథ్యంలో ఏపీ కమలనాథులు మరింత యాక్టివ్ కావటమే కాదు.. అధికార వైసీపీపై రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on November 12, 2022 11:36 am

Share

Recent Posts

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

32 minutes ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

47 minutes ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

2 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

4 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

4 hours ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

4 hours ago