ఏపీ రాజధాని అమరావతిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏకకాలంలో విచారణ జరిపాయి. అమరావతి విషయంపై కొందరు పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచారణకు రావడం గమనార్హం.
అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం తరపున కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. అమరావతిలో అక్రమ భూములపై సీబీఐ చేత విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. సిట్ ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారన్నారు. సీబీఐ చేతనే విచారణ కోరుతున్న ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సబబు కాదన్నారు.
కాగా… సిట్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(నియమ నిబంధనలు) చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదించారు. కాగా, అమరావతిలో అక్రమంగా భూముల కొనుగోలు జరిగిందంటూ ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్)ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ను విచారించి సిట్ పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.
హైకోర్టులో ఏం జరిగిందంటే..
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు.
రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడ మాస్టర్ ప్లాన్ మార్పులపై గ్రామసభలు నిర్వహించడం తప్పనిసరి అయింది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…