Political News

అమ‌రావ‌తిపై సుప్రీ తాజా ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏక‌కాలంలో విచార‌ణ జ‌రిపాయి. అమ‌రావ‌తి విష‌యంపై కొంద‌రు పిటిష‌న్లు సుప్రీంకోర్టుకు వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచార‌ణ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలని భావిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలోనే విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తరపున కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. అమరావతిలో అక్రమ భూములపై సీబీఐ చేత విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. సిట్ ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారన్నారు. సీబీఐ చేతనే విచారణ కోరుతున్న ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సబబు కాదన్నారు.

కాగా… సిట్‌కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(నియమ నిబంధనలు) చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదించారు. కాగా, అమరావతిలో అక్రమంగా భూముల కొనుగోలు జరిగిందంటూ ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్)ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించి సిట్ పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.

హైకోర్టులో ఏం జ‌రిగిందంటే..

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు.

రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్క‌డ మాస్ట‌ర్ ప్లాన్ మార్పుల‌పై గ్రామ‌స‌భ‌లు నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది.

This post was last modified on November 11, 2022 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago