Political News

పాల్‌ను మించిన కాంగ్రెస్ నేతలు

చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయ‌కులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వ‌చ్చేస్తుందని.. బ‌రిలోకి దిగితే త‌మ‌ను ఆప‌డం బ్ర‌హ్మ‌కు సైతం సాధ్యం కాద‌ని.. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాల‌ను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్‌ను మించిపోతున్నారు.

ఇటీవ‌ల మునుగోడు ఉప పోరులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు కేఏ పాల్ ఎలా అయితే.. కామెడీ కామెంట్లు చేసి క‌డుపుబ్బ న‌వ్వించారో.. అంత‌కుమించి త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు చెల‌రేగిపోతున్నారు. జెండా మోసేందుకు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని పార్టీ ఏద‌ని అంటే.. ఠ‌క్కున కాంగ్రెస్ పేరు చెబుతున్న ప్ర‌స్తుత పరిస్థితిలో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ్యూహాలు వేయాల్సిందిపోయి.. ఊహాలోకంలో విహారాలు చేయ‌డం వారికే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా సీనియ‌ర్ నాయ‌కుడు, చింతామోహన్ మాట్లాడుతూ.. మూడేళ్ల వైసిపి పాలన ముచ్చట తీరిపోయిందన్నారు. జగన్ పరిపాలన ప‌ట్ల ప్ర‌జలెవరూ సంతోషంగా లేరని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి బిజెపిలు కనుమరుగైపోతాయని జోస్యం చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమ‌ని బ‌ల్లగుద్దేశారు!!

ఇంకాఏమ‌నుకున్నారో.. ఏమో.. మ‌రింత గ‌ట్టిగా.. వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టిడిపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, తిరుపతిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ పేదలు నివాసం ఉంటున్న డీకేటి భూములకు శాశ్వత పట్టాలిస్తామ‌ని ఏడాదిన్న‌ర ముందే హామీలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి మహిళలకు వచ్చిన 7 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత త‌న‌దేన‌న్నారు. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో పాల్ దొరికాడా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

1 hour ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

1 hour ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago