Political News

పాల్‌ను మించిన కాంగ్రెస్ నేతలు

చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయ‌కులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వ‌చ్చేస్తుందని.. బ‌రిలోకి దిగితే త‌మ‌ను ఆప‌డం బ్ర‌హ్మ‌కు సైతం సాధ్యం కాద‌ని.. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాల‌ను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్‌ను మించిపోతున్నారు.

ఇటీవ‌ల మునుగోడు ఉప పోరులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు కేఏ పాల్ ఎలా అయితే.. కామెడీ కామెంట్లు చేసి క‌డుపుబ్బ న‌వ్వించారో.. అంత‌కుమించి త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు చెల‌రేగిపోతున్నారు. జెండా మోసేందుకు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని పార్టీ ఏద‌ని అంటే.. ఠ‌క్కున కాంగ్రెస్ పేరు చెబుతున్న ప్ర‌స్తుత పరిస్థితిలో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ్యూహాలు వేయాల్సిందిపోయి.. ఊహాలోకంలో విహారాలు చేయ‌డం వారికే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా సీనియ‌ర్ నాయ‌కుడు, చింతామోహన్ మాట్లాడుతూ.. మూడేళ్ల వైసిపి పాలన ముచ్చట తీరిపోయిందన్నారు. జగన్ పరిపాలన ప‌ట్ల ప్ర‌జలెవరూ సంతోషంగా లేరని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి బిజెపిలు కనుమరుగైపోతాయని జోస్యం చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమ‌ని బ‌ల్లగుద్దేశారు!!

ఇంకాఏమ‌నుకున్నారో.. ఏమో.. మ‌రింత గ‌ట్టిగా.. వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టిడిపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, తిరుపతిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ పేదలు నివాసం ఉంటున్న డీకేటి భూములకు శాశ్వత పట్టాలిస్తామ‌ని ఏడాదిన్న‌ర ముందే హామీలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి మహిళలకు వచ్చిన 7 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత త‌న‌దేన‌న్నారు. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో పాల్ దొరికాడా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on November 11, 2022 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago