Political News

పాల్‌ను మించిన కాంగ్రెస్ నేతలు

చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయ‌కులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వ‌చ్చేస్తుందని.. బ‌రిలోకి దిగితే త‌మ‌ను ఆప‌డం బ్ర‌హ్మ‌కు సైతం సాధ్యం కాద‌ని.. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాల‌ను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్‌ను మించిపోతున్నారు.

ఇటీవ‌ల మునుగోడు ఉప పోరులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు కేఏ పాల్ ఎలా అయితే.. కామెడీ కామెంట్లు చేసి క‌డుపుబ్బ న‌వ్వించారో.. అంత‌కుమించి త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు చెల‌రేగిపోతున్నారు. జెండా మోసేందుకు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని పార్టీ ఏద‌ని అంటే.. ఠ‌క్కున కాంగ్రెస్ పేరు చెబుతున్న ప్ర‌స్తుత పరిస్థితిలో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ్యూహాలు వేయాల్సిందిపోయి.. ఊహాలోకంలో విహారాలు చేయ‌డం వారికే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా సీనియ‌ర్ నాయ‌కుడు, చింతామోహన్ మాట్లాడుతూ.. మూడేళ్ల వైసిపి పాలన ముచ్చట తీరిపోయిందన్నారు. జగన్ పరిపాలన ప‌ట్ల ప్ర‌జలెవరూ సంతోషంగా లేరని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి బిజెపిలు కనుమరుగైపోతాయని జోస్యం చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమ‌ని బ‌ల్లగుద్దేశారు!!

ఇంకాఏమ‌నుకున్నారో.. ఏమో.. మ‌రింత గ‌ట్టిగా.. వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టిడిపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, తిరుపతిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ పేదలు నివాసం ఉంటున్న డీకేటి భూములకు శాశ్వత పట్టాలిస్తామ‌ని ఏడాదిన్న‌ర ముందే హామీలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి మహిళలకు వచ్చిన 7 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత త‌న‌దేన‌న్నారు. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో పాల్ దొరికాడా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on November 11, 2022 2:29 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

1 hour ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

2 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

5 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

5 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

6 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

6 hours ago