వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు జిల్లా పరిషత్ కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య కన్నా గుడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు తగ్గాయని ఆమెను ప్రశ్నించగా 15 గుడ్లు పాడయ్యాయని, ఆ గుడ్లను బయటపడేయడంతో వాటిని కాకులు ఎత్తుకెళ్లాయని నిర్వాహకురాలు సమాధానం ఇవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డి షాక్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆమెను విధులనుంచి తొలగించాలని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశించారు. ఏదేమైనా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 10, 2022 10:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…