వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు జిల్లా పరిషత్ కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య కన్నా గుడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు తగ్గాయని ఆమెను ప్రశ్నించగా 15 గుడ్లు పాడయ్యాయని, ఆ గుడ్లను బయటపడేయడంతో వాటిని కాకులు ఎత్తుకెళ్లాయని నిర్వాహకురాలు సమాధానం ఇవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డి షాక్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆమెను విధులనుంచి తొలగించాలని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశించారు. ఏదేమైనా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 10, 2022 10:30 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…