Political News

జ‌న‌సేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?

రాజ‌కీయాల్లో పార్టీల‌కు కానీ, నాయ‌కుల‌కు కానీ అస‌లు అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టం. అవ‌కాశం వ‌చ్చిందా.. వెంట‌నే దానిని అందిపుచ్చుకుని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు నాయ‌కులు, పార్టీలు ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు అనేకం. మ‌రీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తు న్నారు. పొత్తులు పెట్టుకుంటారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. వ్య‌క్తిగ‌తంగా పార్టీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు కూడా. అయితే, ఇలాంటి కీల‌క స‌మ‌యంలో జ‌న‌సేన‌కు ఒక చ‌క్క‌ని ఛాన్స్ వ‌చ్చింది. అదే.. ఈడ‌బ్ల్యుఎస్(అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు) రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీది కి వ‌చ్చింది.

ఇది 10 శాతం కోటా. పైగా.. బీజేపీ ప్ర‌భుత్వ‌మే దీనిని ప్ర‌క‌టించింది. సో.. దీని అమ‌లుకు ఉన్న అడ్డంకు లు సైతం తొలిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని జ‌న‌సేన అందిపుచ్చుకుని ఉంటే బాగుంటుంద‌నేది మేధావుల అభిప్రాయం. గ‌తంలో 2019లో వ‌చ్చిన ఈ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని చంద్ర‌బాబు వినియోగించుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన దీనిలో 5 శాతం ఏకంగా కాపుల‌కు ఇచ్చేశారు. అయితే, త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం దీని ఊసు ఎత్త‌డం లేదు.

పైగా కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్‌ను కూడా ఎత్తేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దీనిని అంది పుచ్చుకుని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా.. ముఖ్యంగా కాపుల కోసం.. దీనిపై ఫైట్ చేయ‌డం ద్వారా మరింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే, ఆయ‌న మాత్రం దీనిపై ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. ఈ రిజ‌ర్వేష‌న్ల మాటేంట‌ని.. ఒక్క మాట కూడా జ‌న‌సేన నేత‌లు కూడా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 10, 2022 2:20 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

3 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

4 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

4 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

8 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

8 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

8 hours ago