Political News

జ‌న‌సేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?

రాజ‌కీయాల్లో పార్టీల‌కు కానీ, నాయ‌కుల‌కు కానీ అస‌లు అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టం. అవ‌కాశం వ‌చ్చిందా.. వెంట‌నే దానిని అందిపుచ్చుకుని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు నాయ‌కులు, పార్టీలు ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు అనేకం. మ‌రీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తు న్నారు. పొత్తులు పెట్టుకుంటారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. వ్య‌క్తిగ‌తంగా పార్టీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు కూడా. అయితే, ఇలాంటి కీల‌క స‌మ‌యంలో జ‌న‌సేన‌కు ఒక చ‌క్క‌ని ఛాన్స్ వ‌చ్చింది. అదే.. ఈడ‌బ్ల్యుఎస్(అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు) రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీది కి వ‌చ్చింది.

ఇది 10 శాతం కోటా. పైగా.. బీజేపీ ప్ర‌భుత్వ‌మే దీనిని ప్ర‌క‌టించింది. సో.. దీని అమ‌లుకు ఉన్న అడ్డంకు లు సైతం తొలిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని జ‌న‌సేన అందిపుచ్చుకుని ఉంటే బాగుంటుంద‌నేది మేధావుల అభిప్రాయం. గ‌తంలో 2019లో వ‌చ్చిన ఈ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని చంద్ర‌బాబు వినియోగించుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన దీనిలో 5 శాతం ఏకంగా కాపుల‌కు ఇచ్చేశారు. అయితే, త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం దీని ఊసు ఎత్త‌డం లేదు.

పైగా కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్‌ను కూడా ఎత్తేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దీనిని అంది పుచ్చుకుని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా.. ముఖ్యంగా కాపుల కోసం.. దీనిపై ఫైట్ చేయ‌డం ద్వారా మరింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే, ఆయ‌న మాత్రం దీనిపై ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. ఈ రిజ‌ర్వేష‌న్ల మాటేంట‌ని.. ఒక్క మాట కూడా జ‌న‌సేన నేత‌లు కూడా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 10, 2022 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

1 hour ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

3 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

3 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

6 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

7 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

9 hours ago