Political News

జ‌న‌సేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?

రాజ‌కీయాల్లో పార్టీల‌కు కానీ, నాయ‌కుల‌కు కానీ అస‌లు అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టం. అవ‌కాశం వ‌చ్చిందా.. వెంట‌నే దానిని అందిపుచ్చుకుని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు నాయ‌కులు, పార్టీలు ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు అనేకం. మ‌రీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తు న్నారు. పొత్తులు పెట్టుకుంటారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. వ్య‌క్తిగ‌తంగా పార్టీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు కూడా. అయితే, ఇలాంటి కీల‌క స‌మ‌యంలో జ‌న‌సేన‌కు ఒక చ‌క్క‌ని ఛాన్స్ వ‌చ్చింది. అదే.. ఈడ‌బ్ల్యుఎస్(అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు) రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీది కి వ‌చ్చింది.

ఇది 10 శాతం కోటా. పైగా.. బీజేపీ ప్ర‌భుత్వ‌మే దీనిని ప్ర‌క‌టించింది. సో.. దీని అమ‌లుకు ఉన్న అడ్డంకు లు సైతం తొలిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని జ‌న‌సేన అందిపుచ్చుకుని ఉంటే బాగుంటుంద‌నేది మేధావుల అభిప్రాయం. గ‌తంలో 2019లో వ‌చ్చిన ఈ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని చంద్ర‌బాబు వినియోగించుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన దీనిలో 5 శాతం ఏకంగా కాపుల‌కు ఇచ్చేశారు. అయితే, త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం దీని ఊసు ఎత్త‌డం లేదు.

పైగా కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్‌ను కూడా ఎత్తేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దీనిని అంది పుచ్చుకుని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా.. ముఖ్యంగా కాపుల కోసం.. దీనిపై ఫైట్ చేయ‌డం ద్వారా మరింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే, ఆయ‌న మాత్రం దీనిపై ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. ఈ రిజ‌ర్వేష‌న్ల మాటేంట‌ని.. ఒక్క మాట కూడా జ‌న‌సేన నేత‌లు కూడా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 10, 2022 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

2 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

8 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

8 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

10 hours ago