ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 11న విశాఖకు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. విశాఖలో ఏర్పాట్లను సైతం దగ్గరుండిమరీ చూసుకుంటున్నారు. అదే సమయంలో మోడీ విశాఖలోని ఏయూలో పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించాలని కూడా వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన బాధ్యలను విశాఖ ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నాయకులు అందరూ కూడా ఇదే పనిపై ఉన్నారు. అయితే.. మోడీ సభ ద్వారా.. వైసీపీ ఏం ఆశిస్తోంది? అసలు ప్లాన్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. గతంలో చంద్రబాబు హయాంలోనూ మోడీ వచ్చారు. అప్పట్లో 2014 ఎన్నికల ప్రచారంలో కలిసి పాల్గొన్నారు. తర్వాత.. రాజధాని శంకుస్థాపనను ఆయన చేతుల మీదుగానే చేయించారు. ఇక, ఆ తర్వాత చంద్రబాబుకు.. మోడీకి మధ్య వివాదాలు.. విభేదాలు చోటు చేసుకున్నాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ హయాంలో మోడీ రాక ఇది రెండోసారి. గతంలో ఆయన అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ విశాఖకు వస్తున్నారు. అంటే.. మోడీని ఒకే ఏడాదిలో రెండుసార్లు రప్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేననే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, గతంలో వచ్చినప్పుడు ప్రధాని కేవలం అల్లూరి విగ్రహావిష్కరణకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో ఏపీ అభివృద్ధి గురించి ఆయన మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. ఇప్పుడు మాత్రం కేవలం అబివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు మాత్రమే మోడీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది తమకు కలిసి వస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. పైగా విశాఖను రాజధాని చేయాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది మరింత మేలు చేస్తుందని అంటున్నారు. అదేసమయంలో విశాఖ వేదికగా.. నిర్వహించే సభ ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఆయన ఏం మాట్లాడతారు? అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎంత కాదన్నా.. అంతో ఇంతో తమపై పాజిటివ్ జల్లులు కురిపించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 9, 2022 4:49 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…