Political News

ఔను.. మా జగన్ ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త ఉంది..

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఇటీవ‌ల రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు ముందుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో మీడియ‌లో సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇప్పుడు త‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌లు మ‌రింత ఏవ‌గించుకుంటున్నార‌ని ఒక‌వైపు టీడీపీ స‌హా జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇదే విష‌యాన్ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ‌ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా నిర్వ‌హించిన గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో మంత్రి ధ‌ర్మాన ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. అయితే.. దీనిపై మీడియా ఇంకెలా ప్ర‌చారం చేస్తుంద‌ని అనుకున్నారో ఏమో.. వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు. ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని ధ‌ర్మాన చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వలనే.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న మాటలో వాస్తవం లేదన్న ధర్మాన.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందన్నారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అని.. కర్నూలు, అమరావతిలో ఆ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నా రు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రస్తుతం పరిపాలనలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమేనన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన గోతులే ఇప్పుడు పెద్దవై ఉంటాయన్నారు.

సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారు అని ధ‌ర్మాన పేర్కొన్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఈయ‌న‌ను ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.

This post was last modified on November 8, 2022 8:59 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

16 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

26 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

42 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago