రాజకీయ పార్టీలంటే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం.. వాటిని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించడమే చూస్తుంటాం. కానీ పార్టీ పెట్టిన వ్యక్తి కోట్ల కొద్దీ తన ఆదాయాన్ని పార్టీ ఫండ్ కింద ఇవ్వడం.. ఆ డబ్బుల్లోంచి అభాగ్యులకు సాయం చేయడానికి పెద్ద మొత్తంలో కేటాయించడం ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే జరుగుతోంది.
ఇటీవలే ఒక సమావేశంలో భాగంగా ఆరేళ్లుగా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తూ పార్టీ కోసం అందులోంచి ఎంత కేటాయించింది.. ఏయే సేవా కార్యక్రమాలకు ఎంత విరాళంగా ఇచ్చింది వివరంగా చెప్పాడు జనసేనాని. కొన్ని నెలల కిందటి నుంచి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ప్రతి కుటుంబానికి ఒక్కో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ జనసేనాని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి తన మానవత్వాన్ని పవన్ చాటుకున్నాడు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం అక్కడ పదుల సంఖ్యలో ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని పవన్ నిర్ణయించాడు. ఈ లక్షతో బాధితులకు ఇల్లు వచ్చేయదు కానీ.. ఎంతో కొంత సాంత్వనగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
ఇల్లు కూల్చినందుకు ప్రభుత్వం కొంత పరిహారం ఇవ్వొచ్చు కానీ.. వాళ్లకు జరిగిన నష్టానికి అది సరిపోకపోవచ్చు. జనసేన ప్లీనరీకి పొలాలు ఇచ్చారని, ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనే కక్ష సాధింపుతోనే ప్రభుత్వం పట్టుబట్టి రోడ్డు విస్తరణ పేరు చెప్పి ఇళ్లను కూల్చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ఆ గ్రామంలో పర్యటించడమే కాక.. ఇప్పుడీ ఆర్థిక సాయం ప్రకటించాడు.
This post was last modified on November 8, 2022 3:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…