Political News

ప‌వ‌న్ ఇచ్చిన హామీకి మైలేజీ వ‌స్తోందా… !

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని ఏపీలో అధికారం చేప‌డ‌తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల ఒక సంచ‌ల‌న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎన్నోఏళ్లు గా ఎదురు చూస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూట‌రి పింఛ‌న్ ప‌థ‌కం)ను ర‌ద్దు చేస్తామ‌ని, తాము అధికారంలోకి రాగానే రెండో సంత‌కం ఈ ఫైలుపైనే పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు. వాస్తవానికి ఇది పెద్ద హామీ అనే చెప్పుకోవాలి. పైగా.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు చంద్ర‌బాబు కానీ, ఇటు జ‌గ‌న్ కానీ నెర‌వేర్చ‌ని హామీ కూడా.

పైగా.. నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది ఉద్యోగులకు సంబంధించిన కీల‌క‌మైన డిమాండ్ కూడా. వారు అనేక ఉద్య‌మాలు కూడా చేశారు ..చేస్తున్నారు. ఇప్ప‌టికీ.. జ‌గ‌న్‌ను డిమాండ్ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కూడా వారు కోరుతున్నారు. కానీ, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీయే అయినా.. దీనివెనుక ఆర్థికంగా క‌ష్ట న‌ష్టాలు ఉన్నాయ‌ని భావిస్తూ.. ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు వెనుకాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితిలో అంటే.. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఈ హామీని నెర‌వేర్చ‌లేక పోయారు. అప్ప‌ట్లో ట‌క్క‌ర్ క‌మిటీని వేసి.. ఆయ‌న త‌ప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఉద్యోగుల డిమాండ్‌ను తాను నెర‌వేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఉద్యోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు తాను ముందుకు వ‌స్తాన‌ని అన్నారు. అయితే.. దీనిపై ఆశించిన మైలేజీ జ‌న‌సేన‌కు వ‌చ్చిందా? అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నకు ఉద్యోగులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా దీనిపై స్పందించ‌లేదు.

ప‌వ‌న్‌కు అభినంద‌న‌లు తెల‌ప‌డం కానీ, ఆయ‌న పార్టీకి తాము అండ‌గా ఉంటామ‌ని కానీ.. ఉద్యోగులు ప్ర‌క‌టించ‌లేదు. పైగా.. జ‌న‌సేన నాయ‌కులు కూడా అస‌లు ఈ హామీని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన విష‌యాన్ని సైతం మ‌రిచిపోయిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తే.. సుమారు.. 20 ల‌క్ష‌ల ఓట్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న 4 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు రిటైరైన 3 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఈ పార్టీకే ద‌క్కుతాయి. కానీ, జ‌న‌సేన నేత‌లు మాత్రం ఈ విష‌యాన్ని ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. మ‌రోవైపు ఉద్యోగులు సైతం.. దీనిపై రియాక్ట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 8, 2022 9:06 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago