వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్… తన పాలన సూపర్గా ఉందని.. తన పాలనలో తీసుకువస్తున్న అనేక పథకాలను.. అనేక సంక్షేమ కార్యక్రమాలను.. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని.. ఇప్పటికి ఈ మూడున్నరేళ్లలో ఈ హామీలను 98 శాతం పూర్తిచేశామని కూడా చెబుతున్నారు. అన్ని వర్గాల వారికీ తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని కూడా .. అంటున్నారు. అయితే.. ఇటీవల దేశవ్యాప్తంగా.. మంచి సీఎంలు ఎవరు అని.. ఒక సంస్థ ఆరా తీసింది.
ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు.. ప్రజలకు అందుతున్న సుపరిపాలన విషయాలపై సర్వే చేసింది. దీనిలో సీఎం జగన్ నాలుగో స్థానానికి పడిపోయారు. అంటే.. ప్రజలు ఆయనను ఎంత గా ఆదరిస్తున్నారో.. అర్ధమవుతుంది. అయితే.. ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ పాలకులు మాత్రం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు జగన్ పాలన భేష్గా ఉందని.. ఎప్పుడు వచ్చినా.. చెబుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు నాలుగో స్థానానికి పడిపోయారనే విషయంపై కీలక నేతలు.. ఏపీ బీజేపీ నాయకులను ఫీడ్ బ్యాక్ కొరినట్టు సమాచారం
ఏపీ సీఎం జగన్ పాలన అనుకున్న విధంగా అయితే.. లేదని..కేంద్రంలోని బీజేపీ పాలకులు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ భావించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోయినా.. నాయకులు మాత్రం ఇదే ఆలోచనలతో ఉన్నారనేది మాత్రం తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఏపీలో బీజేపీ వ్యూహాలు మారిపోవడం ఖాయం. ఇక్కడ బీజేపీ పుంజుకోకపోయినా.. పర్వాలేదు. కానీ, ఇక్కడ ఏర్పడే ప్రభుత్వం ఏంటన్నది మాత్రం కేంద్రంలోని బీజేపీ నేతలకు అత్యంత కీలకం.
గతంలో చంద్రబాబు అధికారంలోకి వస్తారని తెలిసి.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. అలాగే.. 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అనుకుని.. ఆయనకు దన్నుగా నిలబడి.. తమకు సానుకూలంగా మార్చుకున్నారు. ఇప్పడు కూడా.. అంతే. వచ్చే ఎన్నికల్లో.. ఇక్కడ ఎవరు బలంగా ఉంటారో వారికే.. బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. జగన్కు బీజేపీ పెద్దల ఆశీర్వాదం.. ఉంటుందా? ఉండదా? అనేది తేలిపోతుంది.
This post was last modified on November 8, 2022 8:32 am
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…