Political News

‘ఆళ్ల’ మెడ‌కు ఇప్ప‌టం ఉచ్చు.. ఒక్క‌టే మాట!!

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్ల వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డి మెడ‌కు చుట్టుకుంటోంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న‌వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆళ్ల వ‌ర్గానికి చెందిన‌ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరిగిందని.. ఏప్రిల్ 22న ఇళ్లు తొలగిస్తామని నోటీసులు ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇళ్ల కూల్చివేతపై ఆళ్ల వ‌ర్గం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్ర‌జ‌లు ఎవ‌రు న‌మ్మ‌కూడ‌ద‌ని వారు చెబుతున్నారు. తమ గ్రామంలో ఎవరిపైనా దాడులు జరిగితే.. దానికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డిదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్ల వ్య‌వ‌హారంలో రాజ‌కీయం ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే ఇళ్ల కూల్చివేతలో వైసీపీ ఉద్దేశ పూర్వ‌కంగానే దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌ని.. కేవ‌లం జ‌న‌సేన‌కు ఇక్క‌డి రైతులు భూములు ఇచ్చార‌నే ఉద్దేశంతోనే వారి ఇళ్ల‌ను కూల్చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టం వ‌చ్చి ఇక్క‌డి బాధిత ప్ర‌జ‌ల‌ను ఓదార్చారు. వారికి తాను అండ‌గా ఉంటాన‌ని, కూల్చి వేత‌ల ప్ర‌భుత్వం కూలిపోవాల‌ని పిలుపునిచ్చారు. జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అటు హైద‌రాబాద్ వెళ్లిపోగానే ఆళ్ల వ‌ర్గంగా చెబుతున్న కొంద‌రు రంగంలోకి దిగి.. అనుకూల మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన స‌హా ప్ర‌తిప‌క్ష టీడీపీ పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక్క‌డ ఎప్పుడో మార్కింగు వేశార‌ని, వైసీపీ ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తుంటే జ‌న‌సేన‌, టీడీపీలు అడ్డుప‌డుతున్నాయ‌ని.. ఈ కూల్చివేత‌ల్లో ప్ర‌భుత్వ త‌ప్పులేద‌ని వారు వాదించారు.

ఈ ప‌రిణామాల‌పై తాజాగా ఇప్ప‌టం గ్రామ‌స్తులు స్పందించారు. ఆళ్ల వ‌ర్గం చేస్తున్న అసత్య ప్రచారాన్ని గ్రామస్థులు తిప్పికొట్టారు. కేవలం జనసేన సభకు స్థలమిచ్చామని అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న రహదారి 60 అడుగులు ఉందని.. దీనిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రహదారి విస్తరణ అయితే.. వైఎస్ విగ్రహం మాత్రం అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కేవలం జనసేన సభకు స్థలమిచ్చామని అక్కసుతోనే ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని గ్రామస్థులు వాపోయారు. మొత్తం 31 మంది గ్రామస్థులు తమ భూములను సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వగా.. వారిలో పది మంది ఇళ్లను కూలగొట్టారని చెప్పారు. త‌మ‌కు ఏదైనా జ‌రిగితే ఎమ్మెల్యే ఆళ్లదే బాధ్య‌త‌ని వారు తేల్చి చెప్పారు.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

27 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

1 hour ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago