Political News

డిపాజిట్ ద‌క్క‌ని కాంగ్రెస్.. ఎవ‌రు బాధ్యులు?

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పైగా మ‌హిళా సెంటిమెంటు. ఇంత‌కుమించి పాల్వాయి ప్ర‌భంజ‌నం.. వెర‌సి ఇవ‌న్నీ కూడా ప‌నిచేస్తాయ‌ని.. గెలుపు త‌థ్య‌మ‌ని భావించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ చ‌రిత్ర‌లో డిపాజిట్ ద‌క్క‌లేదు.. అనే మాట ఎరుగ‌ని మునుగోడులో ఇప్పుడు డిపాజిట్ సైతం కోల్పోయిన ప‌రిస్థితి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఇప్ప‌టికైనా నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చేసుకుంటే రాబోయే రోజుల్లో పార్టీ బ‌లోపేతం అవుతుంది.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. గత ఉపఎన్నికలో నాగార్జున సాగర్‌, హుజూర్నగర్లో గెలుపు సాధిస్తే.. ఈసారి మునుగోడులోనూ విజయఢంకా మోగించింది. గతంలో పలుమార్లు మునుగోడులో సత్తాచాటిన కాంగ్రెస్ ఈసారి డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ‌గానే భావించాలి. ఎదుగుతున్నాం.. మార్పును ఆశ్వాదిస్తున్నాం.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాం.. అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఖాతాలోని సీటు ఎగిరిపోయింది.

గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి డిపాజిట్ కూడా కోల్పోయింది. కాంగ్రెస్ స్థానాన్ని టీఆర్ఎస్‌ భర్తీ చేసింది. ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకున్నట్లైంది.

ఆది నుంచి స‌హ‌కారం ఏదీ?

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడుపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. మహిళల ఓటర్ల మీద న‌మ్మ‌కం కూడా పెట్టుకున్నారు. అంత‌కుమించి త‌న తండ్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫొటో ప‌నిచేస్తుంద‌ని అనుకున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి సీనియ‌ర్లే త‌న‌ను గెలిపిస్తార‌ని.. త‌న గెలుపు త‌న‌క‌న్నా.. పార్టీకి ముఖ్య‌మని అనుకున్నారు. అయితే, ఈ ఆశలు మొత్తం గుండుగుత్త‌గా గల్లంతయ్యాయి. మహిళలెవరూ స్ర‌వంతి వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది.. ఈ ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని జనం మర్చిపోయే పరిస్థితి ఎదురవుతోంది. గత ఉపఎన్నిక నాగార్జున సాగర్‌లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైనా నాయకత్వం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు… బీజేపీకి టర్న్ అయిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.

ఉక్కు పిడికిలి స‌డ‌లిందా?

మునుగోడు నియోజకవర్గంలో 1962 నుంచి 1985 వరకు కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి గెలుపొందగా… 1985 నుంచి 99 వరకు కమ్యూనిష్టు పార్టీ నుంచి నారాయణ రావు ఎన్నికయ్యారు. ఇక 1999–04లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2004–09లో కమ్యూనిష్టు పార్టీ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి విజయం సాధించగా… 2009–14లో అదే పార్టీ నుంచి యాదగిరి రావు ఎన్నికయ్యారు.

2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రావు గెలుపొందగా… 2018–2022 వరకు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం కాగా… కాంగ్రెస్ ఉక్కు పిడికిలి స‌డ‌లిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 7, 2022 10:14 am

Share
Show comments

Recent Posts

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

9 minutes ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

2 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

2 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

2 hours ago

సమయం మించిపోతోంది స్వయంభు

ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త  రిలీజ్…

3 hours ago

డెకాయిట్ ఎత్తులు దేనికోసం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…

4 hours ago