Political News

వైసీపీ మీడియా న‌వ్వుల‌పాలు

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇప్ప‌టం గ్రామంలో రెండు రోజులుగా న‌డుస్తున్న డ్రామాను అంద‌రూ చూస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు దారుణాతి దారుణంగా త‌యార‌వ‌గా.. కొత్త రోడ్లు వేయ‌డం సంగ‌తి అటుంచితే క‌నీసం గుంత‌లు కూడా పూడ్చ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణం న‌ర‌క‌ప్రాయంగా మారుతోంది. అలాంటిది రెండొంద‌ల ఇళ్లు ఉన్న గ్రామంలో రోడ్డు విస్త‌ర‌ణ పేరుతో ప‌దుల సంఖ్య‌లో ఇళ్ల‌ను కూల్చేయ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జ‌న‌సేన ప్లీన‌రీ స‌మావేశానికి త‌మ భూములు ఇచ్చార‌నే అక్క‌సుతో, ఇత‌ర కార‌ణాల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ద్ద‌తుదారుల‌ను టార్గెట్ చేస్తూ వారి ఇళ్ల‌ను కూల్చేశార‌న్న‌ది బాధితుల ఆరోప‌ణ‌. ఈ ఇష్యూను జ‌న‌సేన‌తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా క‌లిసి రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార్చాయి. త‌ట‌స్థులు కూడా చాలామంది ఈ విష‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

ఐతే ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేసేలా క‌నిపించ‌డంతో వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. ముఖ్యంగా సాక్షి మీడియా.. ఇప్ప‌టం గ్రామంలో కొంద‌రు ఎంపిక చేసిన పార్టీ మ‌ద్ద‌తుదారుల‌తో మాట్లాడించింది. రోడ్డు విస్త‌ర‌ణ‌తో గ్రామానికి మంచి చేయాల‌ని, అభివృద్ధి చేయాల‌ని చూస్తుంటే కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ కొంద‌రు సాక్షికి వీడియో బైట్స్ ఇచ్చారు. కానీ ఆ వీడియోలు వారితో పాటు అధికార పార్టీని, అనుకూల మీడియాను న‌వ్వుల పాలు చేసేలా ఉన్నాయి. ఒక వ్య‌క్తేమో కూల్చిన ఇంటిముందు నిల్చుని గ్రామంలో ఎవ‌రి ఇళ్ల‌నూ కూల్చ‌లేద‌ని అంటాడు. ఇంకో వ్య‌క్తేమో మా ప్ర‌హ‌రీ గోడ‌ను కూల్చేశారు బ్ర‌హ్మాండంగా ఉంది అని కామెంట్ చేస్తాడు. దీంతో స‌ద‌రు వీడియోలు సోష‌ల్ మీడియాలో కామెడీ అయిపోతున్నాయి.

ఇంకోవైపు గాంధీ, అంబేద్క‌ర్ లాంటి మ‌హాత్ముల విగ్ర‌హాలు, శివుడి గుడి ముందున్న నంది విగ్ర‌హం విస్త‌ర‌ణ‌కు అడ్డుగా ఉన్నాయ‌ని చెప్పి వాటిని తీయించి ప‌క్క‌న ప‌డేసి.. రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న వైఎస్ విగ్ర‌హాన్ని మాత్రం అలాగే ఉంచ‌డాన్ని జ‌న‌సేన‌, వైసీపీ మ‌ద్ద‌తుదారులు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెడుతుండ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు ద్వంద్వ ప్ర‌మాణాలు బ‌య‌ట‌ప‌డిపోతున్నాయి.

This post was last modified on November 7, 2022 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

1 hour ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

2 hours ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

3 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

3 hours ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

3 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

4 hours ago