మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రెండు రోజులుగా నడుస్తున్న డ్రామాను అందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు దారుణాతి దారుణంగా తయారవగా.. కొత్త రోడ్లు వేయడం సంగతి అటుంచితే కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. అలాంటిది రెండొందల ఇళ్లు ఉన్న గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పదుల సంఖ్యలో ఇళ్లను కూల్చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన ప్లీనరీ సమావేశానికి తమ భూములు ఇచ్చారనే అక్కసుతో, ఇతర కారణాలతో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లను కూల్చేశారన్నది బాధితుల ఆరోపణ. ఈ ఇష్యూను జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. తటస్థులు కూడా చాలామంది ఈ విషయాన్ని తప్పుబడుతున్నారు.
ఐతే ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా కనిపించడంతో వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. ముఖ్యంగా సాక్షి మీడియా.. ఇప్పటం గ్రామంలో కొందరు ఎంపిక చేసిన పార్టీ మద్దతుదారులతో మాట్లాడించింది. రోడ్డు విస్తరణతో గ్రామానికి మంచి చేయాలని, అభివృద్ధి చేయాలని చూస్తుంటే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొందరు సాక్షికి వీడియో బైట్స్ ఇచ్చారు. కానీ ఆ వీడియోలు వారితో పాటు అధికార పార్టీని, అనుకూల మీడియాను నవ్వుల పాలు చేసేలా ఉన్నాయి. ఒక వ్యక్తేమో కూల్చిన ఇంటిముందు నిల్చుని గ్రామంలో ఎవరి ఇళ్లనూ కూల్చలేదని అంటాడు. ఇంకో వ్యక్తేమో మా ప్రహరీ గోడను కూల్చేశారు బ్రహ్మాండంగా ఉంది అని కామెంట్ చేస్తాడు. దీంతో సదరు వీడియోలు సోషల్ మీడియాలో కామెడీ అయిపోతున్నాయి.
ఇంకోవైపు గాంధీ, అంబేద్కర్ లాంటి మహాత్ముల విగ్రహాలు, శివుడి గుడి ముందున్న నంది విగ్రహం విస్తరణకు అడ్డుగా ఉన్నాయని చెప్పి వాటిని తీయించి పక్కన పడేసి.. రోడ్డు మధ్యలో ఉన్న వైఎస్ విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచడాన్ని జనసేన, వైసీపీ మద్దతుదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండడంతో జగన్ సర్కారు ద్వంద్వ ప్రమాణాలు బయటపడిపోతున్నాయి.
This post was last modified on November 7, 2022 9:37 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…