రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలలో.. టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరో రౌండ్లోనూ అధికారపార్టీ జోరు చూపించింది. ఫలితంగా 2,169 ఓట్ల ఆధిక్యంతో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి దూసుకుపోతున్నారు. టీఆర్ ఎస్కు 38,521 ఓట్లు రాగా..బీజేపీకి 36,352 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 11,894 ఓట్లు మాత్రమే వచ్చాయి. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి దూకుడు ప్రదర్శిస్తుండడంతో బీజేపీలో హై టెన్షన్ పట్టుకుంది.
అంతకుముందు చౌటుప్పల్ మండలానికి సంబంధించి.. 4 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. రెండు, మూడో రౌండ్లలో టీఆర్ ఎస్పై బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక, ఆఖరి నాలుగో రౌండ్లో బీజేపీపై టీఆర్ ఎస్ ముందంజలోకి వచ్చింది. మొత్తంగా చౌటుప్పల్కు సంబంధించి నాలుగు రౌండ్లలో టీఆర్ ఎస్, బీజేపీ.. చెరి సగం రౌండ్లలో ఆధిక్యతను ప్రదర్శించాయి.
చౌటుప్పల్ మండలం లెక్కింపు పూర్తి కావడంతో సంస్థాన్ నారాయణపురం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ 5, 6 రౌండ్లను టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది. ఏదేమైనా రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఫలితం.. ఆది నుంచి అనుకున్న విధంగానే బీజేపీ-టీఆర్ఎస్ల మధ్యనువ్వా-నేనా అన్నట్టుగా టగ్ ఆఫ్ వారు జరుగుతుండడం గమనార్హం. మొత్తంగా 15 రౌంట్ల కౌంటింగ్ పూర్తయితే తప్ప..మునుగోడు ఎవరిదనేది చెప్పడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on November 6, 2022 8:15 pm
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…
ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…