Political News

ఓట్ల లెక్కింపు వేళలోనూ కేఏపాల్ కామెడీ ఆగలేదుగా?

గంభీరంగా ఉండే రాజకీయాలకు తనదైన మార్కు అద్దటం ద్వారా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సైతం కామెడీగా మార్చేసే విలక్షణ వ్యక్తిత్వం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ సొంతంగా చెప్పాలి. చాలామంది ఆయన్ను కామెడీగా తీసుకుంటారు. కానీ.. ఆయన మాటల్నిసీరియస్ గా విన్న వారెవరూ కూడా ఆయన్ను కామెడీ పీస్ గా ఫీల్ కారు. ఆయనలో చతురత ఎక్కువ. ఏదైనా ప్రశ్న అడగాలే కానీ.. అస్సలు వెనక్కి తగ్గరు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు సైతం షాకింగ్ రిప్లైలు ఇవ్వటం ద్వారా తన సత్తా ఏమిటో చాటి చెబుతుంటారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారిన కేఏ పాల్.. పోలింగ్ రోజున ఎన్ని యేషాలు వేశారో.. మరెంత కామెడీ చేశారో తెలిసిందే. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన ఉంగరం గుర్తును.. అందరూ గుర్తుంచుకోవటానికి వీలుగా.. పది వేళ్లకు పది ఉంగరాల్ని పెట్టుకోవటం తెలిసిందే. మీకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఇలా వేళ్లకు పెట్టుకొని తిరగటమా? అని ప్రశ్నిస్తే.. టీఆర్ఎస్ వాళ్లు 30 వేల కార్లలో తిరుగుతున్నారు. వారి ఎన్నికల గుర్తు కారు కాబట్టి.. కారు వాడటం ఆపేయమంటారా? అంటూ ప్రశ్నిస్తూ షాకిచ్చారు.

ఈ ఎన్నికల్లో కేఏ పాల్ కు వచ్చే ఓట్ల మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. దీనికి తగ్గట్లే.. ఓట్ల లెక్కింపు వేళలోనూ అలాంటి పరిస్థితే ఉంది. మొత్తం మూడు రౌండ్లకు కలిపి కేఏ పాల్ కు 34 ఓట్లు రావటం చూస్తే.. ఓటర్లలో ఆయనకున్న ఇమేజ్ ఎంతన్న విషయం అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు ఒకవైపు జోరుగా సాగుతున్న వేళ.. ఆయన పోలీసుల్ని అడిగిన అనుమతి గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే.. పోలీసుల్ని ఆయన ఎన్నికల విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరారు.

ఎందుకిలా అంటే.. మునుగోడులో తాను 50 వేల మెజార్టీతో విజయాన్ని సాధిస్తున్నానని.. అందుకు అవసరమైన విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అయితే.. పోలీసులు ఈ విన్నపానికి ఒప్పుకోలేదు. రిజెక్టు చేశారు. 50 వేల మెజార్టీ తర్వాత.. ముందు 500 ఓట్లు దాటితే అదే గొప్ప అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప పోరులో కేఏపాల్ కామెడీ అన్ స్టాపబుల్ అని మాత్రంచెప్పక తప్పదు.

This post was last modified on November 6, 2022 8:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

42 mins ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

2 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

2 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

3 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago