ఏపీలో తిరుగులేని శక్తిగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు అధినేత మాత్రం తగ్గని వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పార్టీ ఎంపీ రఘురామ రాజు కలకలం గురించి తెలిసిందే. పార్టీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన తీరుపై ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వటం తెలిసిందే. ఇలాంటివేళ.. పార్టీకి చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామరాజు కలిసి ఉన్న సెల్ఫీ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇరువురునేతలు హ్యాపీగా ఉన్నవేళ తీసుకున్న ఫోటో ఇప్పుడు పార్టీని భయపెడుతోంది.
అగ్నికి ఆయువు తోడైనట్లు.. రఘురామకు ఆనం లాంటి సీనియర్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆనం అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని మర్చిపోకూడదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు సెట్ కాక.. ఆయనకు మంత్రి పదవి రాలేదని చెబుతారు. జగన్ తీరుపై గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళలోనే.. పార్టీకి చెందిన మరో అసంతృప్తి నేతగా ముద్ర పడిన రఘురామరాజుతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు పలువురుఈ ఫోటోను చూసినంతనే ఉలిక్కిపడుతున్నారు. అయితే.. ఈ ఫోటో ఎప్పుడు దిగింది? ఏ సందర్భంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు? అన్న అంశాలపై జగన్ పార్టీ నేతలు ఆరా తీయటం మొదలైనట్లు తెలుస్తోంది.
This post was last modified on July 12, 2020 11:14 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…