Political News

జగన్ పార్టీని భయపెడుతున్న సెల్ఫీ

ఏపీలో తిరుగులేని శక్తిగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు అధినేత మాత్రం తగ్గని వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పార్టీ ఎంపీ రఘురామ రాజు కలకలం గురించి తెలిసిందే. పార్టీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన తీరుపై ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వటం తెలిసిందే. ఇలాంటివేళ.. పార్టీకి చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామరాజు కలిసి ఉన్న సెల్ఫీ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇరువురునేతలు హ్యాపీగా ఉన్నవేళ తీసుకున్న ఫోటో ఇప్పుడు పార్టీని భయపెడుతోంది.

అగ్నికి ఆయువు తోడైనట్లు.. రఘురామకు ఆనం లాంటి సీనియర్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆనం అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని మర్చిపోకూడదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు సెట్ కాక.. ఆయనకు మంత్రి పదవి రాలేదని చెబుతారు. జగన్ తీరుపై గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళలోనే.. పార్టీకి చెందిన మరో అసంతృప్తి నేతగా ముద్ర పడిన రఘురామరాజుతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు పలువురుఈ ఫోటోను చూసినంతనే ఉలిక్కిపడుతున్నారు. అయితే.. ఈ ఫోటో ఎప్పుడు దిగింది? ఏ సందర్భంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు? అన్న అంశాలపై జగన్ పార్టీ నేతలు ఆరా తీయటం మొదలైనట్లు తెలుస్తోంది.

Satya

Recent Posts

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

2 hours ago

కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…

2 hours ago

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

3 hours ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

3 hours ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

4 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

6 hours ago