పశ్నిస్తానంటూ పార్టీ పెట్టి రాజకీయంగా రెండోసారి(తొలిసారి ప్రజారాజ్యం) అరంగేట్రం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తరచుగా ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కౌలు రైతు సమస్యల నుంచి రహదారుల దుస్థితి వరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీశా రు. భవిష్యత్తులోనూ నిలదీస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల విశాఖ ఘటన విషయంలోనూ తీవ్రస్థాయిలో సర్కారుపై నిప్పులు చెరిగారు.
అయితే, ప్రశ్నించేవాడికే ప్రశ్నలు అన్నట్టుగా తాజాగా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామానికి సంబం ధించి రైతులు పవన్కు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూన్లో ఇక్కడ నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు కొందరు రైతులు భూములు ఇచ్చారు. అయితే, దీనిని మనసులో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధించే క్రమంలో ఇక్కడ ఇళ్లను కూల గొడుతోందన్నది పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు.
మరోవైపు.. ఈ పర్యటనకు వచ్చిన పవన్ను ఉద్దేశించి ఒకరిద్దరు రైతులు ఆసక్తికర ప్రశ్నలు సంధిస్తున్నా రు. గతంలో సభ పెట్టినప్పుడు.. ఇక్కడి ప్రజలకు రూ.50 లక్షలు ఇస్తానని పవన్ చెప్పారని, దీనికి సంబంధించి ఆయన వాగ్దానం కూడా చేశారని, కానీ, ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదని.. అంటున్నారు. పవన్ ఇప్పటికైనా 50 లక్షలు ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల తొలగింపు ప్రక్రియకు రాజకీయాలకు సంబంధం లేదని కూడా అంటున్నారు.
మార్చిలో ఈ ఇళ్లకు సంబంధించిన మ్యాప్ను అదికారులు ఇచ్చారని చెబుతున్నారు. రోడ్డు విస్తరణ అనేది ఎప్పటి నుంచో ఉందని చెబుతున్నారు. పవన్ దీనిని రాజకీయం చేయడం సరికాదని అనే రైతులు కూడా తెరమీదికి వచ్చారు. అయితే, దీనిపై జనసేన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి. మొత్తానికి ఇప్పటి వరకు పవన్ను ప్రజలు ఎవరూ ప్రశ్నించలేదు. కానీ, తాజాగా 50 లక్షల విషయంలో ఆయన కు ప్రశ్నలు ఎదురు కావడం గమనార్హం.
This post was last modified on November 5, 2022 10:21 pm
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…