Political News

ఏపీలో ఆ డ‌బ్బులు ఏమ‌వుతున్నాయ్ బ్రో!!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే బాగానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంది. పెట్టుబడులు, ప‌రిశ్ర‌మల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇత‌ర ఆదాయ మార్గాలైన ప‌న్నులు, స‌ర్ చార్జీలు, వ్యాట్ ఇలాంటి వాటి రూపంలో ప్ర‌జ‌ల నుంచి బాగానే పిండుతున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని చెత్త‌పై ప‌న్నును వ‌సూలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం ఏపీనే! ఇక‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రం, ప‌న్నులు వేసేస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే.

సో.. వీటి వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వానికి బాగానే సొమ్ములు స‌మ‌కూరుతున్నాయి. అయితే, వీటికి లెక్క‌లు ఏవీ? అంటే మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు ఇస్తున్నారా? అంటే లేదు. ప్ర‌స్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం అనేది కలగా మిగిలి పోతోంది. ఈ నెల ఇంకా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి రూ.1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెల నెలా ఇదేతంతుగా కూడా మారిపోయింది.

అంద‌రికీ జీతాలు అందేసరికి నెలలో 20వ తేదీ వస్తోంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఖజానాకు వచ్చే వేల కోట్ల ఆదాయం నుంచి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఇవ్వొచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఆపుతోంది. ఈ నెలలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆదాయం స‌రే.. అప్పులేమ‌య్యాయి?

ఏపీ ఆదాయం సంగ‌తి అలా ఉంచితే.. ఆర్‌బీఐ నుంచి రూ.2,500 కోట్ల వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్ కింద ప్ర‌భుత్వం అప్పు తెచ్చింది. ఇవి కాకుండా ఓడీ అప్పు కింద ఇంకో రూ.2000 కోట్లు తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ అప్పులతో పాటు నవంబరు 1వ తేదీ ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి రూ.1413 కోట్ల అప్పు తెచ్చారు. ఇవన్నీ కలుపుకొంటే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇవ్వవచ్చు. కానీ, ఇవ్వ‌డం లేదు. మ‌రి ఆ సొమ్ములు ఏమైన‌ట్టు? పోనీ.. ఖ‌జానా అయినా నిండుగా ఉందా? అంటే లేదు. ఖ‌జానా ఎప్ప‌టిక‌ప్పుడు ఖాళీగానే ఉంటోంది.

కాగ్ ఏమందంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 300 రోజులకుపైగా వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్‌, ఓడీ అప్పులతోనే గడుపుతోంది. వీటిని పరిమితికి మించి అతిగా వాడుతోంది అని ఇటీవల కాగ్‌ తన నివేదికలోనూ, ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘క్రిసిల్‌’ సీఆర్డీఏ బాండ్లపై ఇచ్చిన రిపోర్టులోనూ వెల్లడించాయి. వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఓడీలను అతిగా వాడడం అంటే బలహీన ఆర్థిక వ్యవస్థకు సంకేతమని అవి తేల్చేశాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను మాత్రం తగ్గించుకోవడం లేదు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ లేదు. మ‌రి నిధులు ఏమ‌వుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

This post was last modified on November 5, 2022 1:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

1 hour ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

2 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

2 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

2 hours ago

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

5 hours ago

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

10 hours ago