Political News

ఏపీలో ఆ డ‌బ్బులు ఏమ‌వుతున్నాయ్ బ్రో!!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే బాగానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంది. పెట్టుబడులు, ప‌రిశ్ర‌మల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇత‌ర ఆదాయ మార్గాలైన ప‌న్నులు, స‌ర్ చార్జీలు, వ్యాట్ ఇలాంటి వాటి రూపంలో ప్ర‌జ‌ల నుంచి బాగానే పిండుతున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని చెత్త‌పై ప‌న్నును వ‌సూలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం ఏపీనే! ఇక‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రం, ప‌న్నులు వేసేస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే.

సో.. వీటి వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వానికి బాగానే సొమ్ములు స‌మ‌కూరుతున్నాయి. అయితే, వీటికి లెక్క‌లు ఏవీ? అంటే మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు ఇస్తున్నారా? అంటే లేదు. ప్ర‌స్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం అనేది కలగా మిగిలి పోతోంది. ఈ నెల ఇంకా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి రూ.1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెల నెలా ఇదేతంతుగా కూడా మారిపోయింది.

అంద‌రికీ జీతాలు అందేసరికి నెలలో 20వ తేదీ వస్తోంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఖజానాకు వచ్చే వేల కోట్ల ఆదాయం నుంచి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఇవ్వొచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఆపుతోంది. ఈ నెలలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆదాయం స‌రే.. అప్పులేమ‌య్యాయి?

ఏపీ ఆదాయం సంగ‌తి అలా ఉంచితే.. ఆర్‌బీఐ నుంచి రూ.2,500 కోట్ల వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్ కింద ప్ర‌భుత్వం అప్పు తెచ్చింది. ఇవి కాకుండా ఓడీ అప్పు కింద ఇంకో రూ.2000 కోట్లు తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ అప్పులతో పాటు నవంబరు 1వ తేదీ ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి రూ.1413 కోట్ల అప్పు తెచ్చారు. ఇవన్నీ కలుపుకొంటే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇవ్వవచ్చు. కానీ, ఇవ్వ‌డం లేదు. మ‌రి ఆ సొమ్ములు ఏమైన‌ట్టు? పోనీ.. ఖ‌జానా అయినా నిండుగా ఉందా? అంటే లేదు. ఖ‌జానా ఎప్ప‌టిక‌ప్పుడు ఖాళీగానే ఉంటోంది.

కాగ్ ఏమందంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 300 రోజులకుపైగా వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్‌, ఓడీ అప్పులతోనే గడుపుతోంది. వీటిని పరిమితికి మించి అతిగా వాడుతోంది అని ఇటీవల కాగ్‌ తన నివేదికలోనూ, ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘క్రిసిల్‌’ సీఆర్డీఏ బాండ్లపై ఇచ్చిన రిపోర్టులోనూ వెల్లడించాయి. వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఓడీలను అతిగా వాడడం అంటే బలహీన ఆర్థిక వ్యవస్థకు సంకేతమని అవి తేల్చేశాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను మాత్రం తగ్గించుకోవడం లేదు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ లేదు. మ‌రి నిధులు ఏమ‌వుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

This post was last modified on November 5, 2022 1:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 minutes ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

3 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

4 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

4 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

6 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

8 hours ago