Political News

ప‌వ‌న్ ఇంటికి వాళ్లు మందు తాగి వెళ్లారు అంతే: పోలీసులు

హైదరాబాద్లోని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వ‌హించార‌నే సంచ‌ల‌న‌ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని, అది కేవ‌లం క‌ల్పితేమ‌న‌ని అన్నారు.

“పబ్‌లో మందు తాగి వస్తూ పవన్ ఇంటివద్ద యువకులు కారు ఆపారు. కారు తీయాలని అడిగిన పవన్ సెక్యూరిటీతో ఆ ముగ్గురు యువకులు గొడవకు దిగారు. తాగిన మైకంలోనే పవన్ ఇంటివద్ద గొడవ పడినట్లు వారు ఒప్పుకున్నారు. పవన్ ఇంటివద్ద ఆపిన గుజరాత్ రిజిస్ట్రేషన్‌ కారు సాయికృష్ణది” అని పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసుల వివరణపై జనసేన నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.

నాదెండ్ల ప్ర‌క‌ట‌న‌తో..

ఏపీలో విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ గురువారం పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నది అభిమానులు కాదని, వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తమ అధినేత ఇంటి వద్ద ముగ్గురు గొడవ చేశారని.. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో తెలంగాణ జనసేన నేత ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

పవన్ ఇంటి నుంచి వెళ్లినపుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్‌ను అనుసరిస్తున్నది.. ఆయన అభిమానులు కాదన్న నాదెండ్ల మనోహర్.. వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా స్పందించి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా పోలీసులు మాత్రం అస‌లు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించారు.

This post was last modified on November 4, 2022 10:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago