తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. మరోవైపు ఈ నెల 10న కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న ఆయన చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్లో టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు. ఇక, కొన్నాళ్లుగా కాసాని రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవల చంద్రబాబు పిలుపుతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది.
అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కాసానిని పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఆయన కు ఏకంగా తెలంగాణ పార్టీ పగ్గాలు ఇవ్వడంపై నాయకులు చర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీలను ఏకం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బీసీలను టీడీపీకి అనుకూలంగా మార్చడంపైనా కాసాని పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో బీసీల ఓట్లు 65 శాతం పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా బలమైన నాయకుడిగా ఉన్న బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీపగ్గాలు అప్పగించారని చెబుతున్నారు. మరి ఈయన ఏమేరకు పార్టీని డెవలప్ చేస్తారో చూడాలి. ఏదేమైనా తాజా నిర్ణయంపై తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 4, 2022 9:55 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…