తన స్నేహితురాలు.. తన స్నేహితుడే అయిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఆమె కూతురిని హత్య చేసి చంపాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడా చిన్నారి తండ్రి.. తన కూతురు పోయిన బాధను తట్టుకోలేక తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడా ఇల్లాలి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల ఘట్కేసర్లో ఆరేళ్ల పాప ఆద్య హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్నారి తండ్రి తన ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో మరింత విషాదం చోటు చేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్.. శనివారం భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితమే ఆద్యను కరుణాకర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. తన పాప మరణంతో కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాక ఈ వ్యవహారంతో కుటుంబ పరువు పోయిందని కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
భువనగిరికి చెందిన కల్యాణ్, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అమ్మాయిని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆద్య అనే ఆరేళ్ల పాప ఉంది. మూడేళ్లుగా వీరి కుటుంబం పోచారంలోని ఇస్మాయిల్ఖాన్గూడ విహారి హోమ్స్లో నివాసం ఉంటోంది. ఐతే రెండేళ్ల కిందట సెల్ఫోన్ లావాదేవీల విషయంలో కళ్యాణ్ భార్యకు.. కరుణాకర్తో పరిచయమైంది. అతను ఆమెను తరచుగా కలుస్తుండే వాడు. ఐతే కరుణాకర్ ద్వారా పరిచయమైన రాజశేఖర్ అనే మరో వ్యక్తి.. ఆమెకు సన్నిహితుడయ్యాడు. వీరి స్నేహం కరుణాకర్కు నచ్చలేదు. వీరి సంగతి తేల్చేందుకు కరుణాకర్.. ఆ మహిళ ఇంటికి వెళ్లడం.. అక్కడ రాజశేఖర్ ఉన్నట్లు తెలుసుకోవడం.. కత్తితో దాడికి ప్రయత్నించిన కరుణాకర్కు భయపడి రాజశేఖర్ ఓ గదిలో దాక్కోవడం.. బయటికి రాకుంటే ఆ మహిళ కూతురు ఆద్యను చంపేస్తానని కరుణాకర్ బెదిరించడం.. రాజశేఖర్ బయటికి రాకపోవడంతో అన్నంత పనీ చేయడం.. ఇవన్నీ నిమిషాల్లో జరిగిపోయాయి. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆద్య.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఇప్పుడు ఆమె తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
This post was last modified on July 11, 2020 10:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…