ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీకి కంచుకోట అనే ఈ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ పట్టు పెంచుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని టెక్కలిలో ఓడించి తీరాలనేది ఆయన సంకల్పంగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్ను కూడా దువ్వాడ శ్రీనివాస్కు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ నాయకులను అలెర్ట్ చేశారు.
ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు గెలుచుకున్న స్థానాల్లో ఓటమి రాకూడదని గట్టిగా చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చాపురం, టెక్కలి స్థానాలను టీడీపీ గెలుచుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది జగన్ సంకల్పం. ఈ నేపథ్యంలో ఇక్కడ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించేలా ఇక్కడ మెగా వైద్య శాలను నిర్మిస్తున్నారు.
అదే విధంగా ఉపాధి కల్పన, వలసల నిరోధానికి కూడా జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో అసంతృప్తి పొడచూపకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ జోరు పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, మంత్రి సీదిరి అప్పలరాజులు పైర్ బ్రాండ్రాజకీయాలకు కేరాఫ్గా మారారు. దీంతో ఇక్కడ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, మరోవైపు మంత్రి ధర్మాన సోదరులు ఇద్దరూ కూడా మేథావులను కదిలించి విశాఖ రాజదాని సహా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తున్నారు. సీఎం జగన్ మంచి చేస్తుంటే దీనిని టీడీపీ వాళ్లు వద్దంటున్నారంటూ ధర్మాన మేధావులను కదిలిస్తున్నారు. వరుసగా ఆయన సమావేశాలు పెట్టిమరీ.. వైసీపీకి అనుకూలంగా చక్రం తిప్పుతున్నారు. అయితే, టీడీపీకి కూడా ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు. గుండ లక్ష్మీదేవి, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్లు దూకుడుగా ఉన్నారు.
మిగిలిన వారు కూడా తమ తమ పంథాలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు తీవ్రంగానే కనిపిస్తుండడం గమనార్హం. ఇక, బలాబలాల విషయానికి వస్తే.. ఎవరి బలం వారికే ఉంది. టీడీపీ సంస్థాగతంగా ఇప్పటికీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన చోట కూడా కేడర్ చెక్కుచెదరకపోవడం పార్టీకి కలిసివస్తున్న ప్రధాన పరిణామం. ఇక, వైసీపీ విషయానికివస్తే..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం జోరుగాసాగుతోంది.
ఇక్కడ నిర్మించాలని భావిస్తున్న పోర్టు విషయంపైనే కొంత రగడ ఉంది. ఇది కనుక సక్సెస్గాసాగిపోతే.. రెండు పార్టీలు హోరాహోరీ తలపడే జిల్లాల్లో శ్రీకాకుళమే ముందు వరుసలో ఉంటుందన్నది పరిశీలకుల అంచనా. ఇక, అభ్యర్థుల పరంగా కూడా జిల్లాలో రెండు పార్టీలూ బలంగానే ఉన్నాయి. సో.. ఎన్నికల ముందు ఏదైనా పెద్ద మార్పు జరిగితే తప్ప పోరు మాత్రం తీవ్రంగానే సాగనుంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…