Political News

ప‌వ‌న్‌కు ప్ర‌జారాజ్యం అండ‌.. క‌లిసి వ‌చ్చేనా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు పెద్ద ద‌న్నే దొరికిన‌ట్టు అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి కేడ‌ర్ లేదు. నాయ‌కులు లేరు.. అంటూ.. పెద్ద ఎత్తున జ‌న‌సేన‌లో ఒక చ‌ర్చ అయితే జ‌రిగింది. దీనికి పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ నుంచి ఎలాంటి ఆన్స‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. కానీ, తాజాగా మారిన‌ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు ఒక కీల‌క‌మైన మైలు రాయి వంటి మైలేజీ ల‌భిస్తోంది. గ‌తంలో మెగాస్టార్ ప్రారంభించిన ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌క రోల్ పోషించిన నాయ‌కులు.. చాలా మంది ఇప్పుడు జ‌న‌సేన‌తో క‌లిసి న‌డిచేందుకు రెడీ అయ్యారు.

2007లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ భారీ ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌యార‌య్యారు. అదేవిధంగా యువ రాజ్యం పేరుతో యువ‌త‌ను సైతం నాయ‌కులుగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం జ‌రిగింది. వారంతా యాక్టివ్‌గానే అప్ప‌ట్లో ప‌నిచేశారు. అయితే.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో వారు దూర‌మ‌య్యారు. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం.. తెలిసిందే. కొంద‌రు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే మ‌రికొంద‌రు మాత్రం కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి దాదాపు 15 సంవ‌త్స‌రాల పాటు.. వీరంతా ఎక్క డున్నారో.. ఏం చేశారో తెలియ‌దు కానీ..తాజాగా మాత్రం ప‌వ‌న్‌ను బ‌ల‌ప‌రిచేందుకు, జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేసేందుకు రెడీ కావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ఇటీవ‌ల వీరంతా తిరుప‌తి వేదిక‌గా భేటీ అయి.. జ‌న‌సేన‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని తీర్మానం చేశారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ జ‌న‌సేన స‌భ్య‌త్వం స్వీక‌రించ‌డంతోపాటు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు స్వ‌చ్ఛందంగా క‌లిసి రావాల‌ని నిర్ణ‌యించారు.

దీంతో జ‌న‌సేన‌కు కొత్త ర‌క్తం వ‌చ్చిన‌ట్టు అయింద‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఇప్ప‌టికే మెగా అభిమానులు కూడా తోడ‌వు తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనే విజ‌య‌వాడ వేదిక‌గా .. మెగా ఫ్యాన్స్ భేటీ నిర్వ‌హించి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏకం కావాల‌ని మెగా కుటుంబానికి ఇండ‌స్ట్రీ ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా కూడా బ‌ల‌ప‌ర‌చాల‌ని నాయ‌కులు నిర్ణ‌యించారు. ఇలా.. ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు ప్ర‌జారాజ్యం మాజీ నాయ‌కులు కూడా జ‌న‌సేన‌కు అండ‌గా నిలిచేఅవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి దీనిని ప‌వ‌న్ ఎలా వినియోగించుకుంటారో చూడాలి.

This post was last modified on November 4, 2022 8:34 am

Share
Show comments
Published by
satya

Recent Posts

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

5 mins ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

6 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

8 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

9 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

9 hours ago

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

10 hours ago