Political News

చివరికి జగన్ రూట్లోకే వచ్చిన కేసీఆర్

కరోనాపై పోరాటంలో మొదట తెలంగాణ ప్రభుత్వం ప్రశంసల్లో మునిగి తేలింది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలొచ్చాయి. కానీ తర్వాత కథ మారింది. తెలంగాణలో కరోనా పరీక్షలు దేశంలోనే అతి తక్కువగా చేయడం, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి, ఇతర కారణాలతో తెలంగాణ సర్కారు విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది.

అదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనాపై పోరాటంలో చురుగ్గా వ్యవహరించడం, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, దీనిపై జాతీయ మీడియాలోనూ చర్చ జరగడం, చివరికి ప్రతిపక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారను అభినందించడం తెలిసిన సంగతే. తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్ సూచించిన ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలు చేస్తూ వచ్చింది. ఆ పరీక్షలు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి. ఫలితాలు రావడానికి కూడా మూణ్నాలుగు రోజులు సమయం పడుతుంది.

ఐతే జగన్ ప్రభుత్వం చాలా ముందుగానే ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్స్ తెప్పించి విరివిగా టెస్టులు చేయడం మొదలుపెట్టింది. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు అందరికీ టెస్టులు చేస్తూ పోయింది. ఈ మధ్యే పది లక్షల టెస్టుల మార్కును కూడా దాటేసింది ఏపీ. ఐతే ర్యాపిడ్ టెస్టుల ప్రామాణికతపై ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చిన తెలంగాణ సర్కారు.. హైకోర్టు ఆదేశాలు, జనాల డిమాండ్ల నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచడానికి ర్యాపిడ్ టెస్టులనే ఆశ్రయించక తప్పలేదు.

నిన్న, శుక్రవారం తెలంగాణలో పది వేలకు పైగా టెస్టులు చేయడం విశేషం. వీటిలో మెజారిటీ పరీక్షలు ర్యాపిడ్ కిట్స్‌తో చేసినవే. ప్రభుత్వం ఇటీవలే 2 లక్షల దాకా ర్యాపిడ్ కిట్లు తెప్పించినట్లు సమాచారం. వాటితో రెండు వారాల వ్యవధిలో రెండు లక్షల టెస్టులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక రోజూ కనీసం పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తారట. టెస్టుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి.

This post was last modified on July 12, 2020 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాకా – ఇది ఊహించలేదు కాకా

అత్యంత క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ముందు వరసలో ఉన్న అల్లు అర్జున్ - అట్లీ కాంబో మీద…

1 hour ago

ఐకాన్ స్టార్… విజేత నుంచి విశ్వవిజేత దాకా

స్టార్ లెగసి ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి హీరోలు రావడం కొత్త కాదు. అన్ని భాషల్లో జరిగేదే. కానీ లెజెండరీ…

2 hours ago

ఏప్రిల్ & మే… కొత్త సినిమాలతో బాక్సాఫీస్ రష్

ఇంకో 22 రోజులు ఉండగానే మే నెల బాక్సాఫీస్ క్యాలికులేషన్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని తెలిశాక…

2 hours ago

ఏపీ రాజధాని అమరావతిలో ‘కొత్త సిస్టమ్’

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కేంద్రం నోటిఫై చేసిన నేప‌థ్యంలో దీనికి చ‌ట్ట‌బద్ధ‌త క‌లిగింది. అయితే.. ఇక నుంచి అమ‌రావ‌తిని ప్ర‌త్యేకంగా…

2 hours ago

మ‌న శ‌త్రువు.. ప్ర‌పంచానికి మిత్రుడైతే!

శ‌త్రువులో సైతం మంచి ల‌క్ష‌ణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భార‌త్ సొంతం. రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌తాలు కూడా ఇదే చెబుతున్నాయి.…

2 hours ago

లెనిన్ మాట మీద ఉండటమే కరెక్ట్

ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక…

3 hours ago