Political News

వైసీపీ నేత చెప్పాడు.. కుప్పంలో ఓటుకు 5 వేలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మీద ఏడాది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించాలని జగన్ చాలా పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. 175కి 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధ్యం కాదంటూ ఆ మధ్య జగన్ పర్యటన సందర్భంగా గోడల మీద పెయింటింగ్స్ రాయించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా బాబుకు చెక్ పెట్టే ఉద్దేశంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పట్టుబట్టి వైసీపీని గెలిపించుకున్న సంగతీ తెలిసిందే.

అధికార బలాన్ని ఆ సమయంలో ఎంతగా ఉపయోగించారో అందరూ చూశారు. తమిళనాడు నుంచి జనాన్ని తెప్పించి దొంగ ఓట్లు వేయించిన సంగతి ఆధారాలతో బయటపెట్టారు తెలుగుదేశం మద్దతుదారులు. ఏదైతేనేం.. చివరికి అక్కడ వైసీసీనే గెలిచింది.

కానీ అక్కడ గెలిచిన ఆనందం వైకాపా కౌన్సిలర్లలోనే లేదనడానికి రుజువు తాజాగా బయటికి వచ్చిన ఒక వీడియో. మున్సిపల్ సమావేశం సందర్భంగా ఒక కౌన్సిలర్ భర్త మున్సిపల్ కమిషనర్‌ను బిల్లుల విషయంలో నిలదీశాడు.

ఇంతింత ఖర్చు పెట్టుకుని గెలిస్తే చిన్న చిన్న పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా ఓటుకు ఐదు వేల రూపాయలు పంచి గెలిచామంటూ అతను నోరు జారాడు. కౌన్సిలర్ భర్త అయిన అతను.. కమిషనర్ ముందు ఇలా మాట్లాడుతూ, నిలదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ ఎలా గెలిచిందో చెప్పడానికి రుజువు ఇదని, ఇదీ ఒక గెలుపేనా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ గెలుపు విషయంలో ఆ పార్టీ నాయకులకే ఆనందం లేదని, రాష్ట్రమంతటా ఉన్నట్లే ఇక్కడ కూడా బిల్లులు రాక వైకాపా నేతలే ఇబ్బంది పడుతున్నారంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది.

This post was last modified on November 1, 2022 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

5 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago