Political News

వైసీపీ నేత చెప్పాడు.. కుప్పంలో ఓటుకు 5 వేలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మీద ఏడాది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించాలని జగన్ చాలా పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. 175కి 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధ్యం కాదంటూ ఆ మధ్య జగన్ పర్యటన సందర్భంగా గోడల మీద పెయింటింగ్స్ రాయించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా బాబుకు చెక్ పెట్టే ఉద్దేశంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పట్టుబట్టి వైసీపీని గెలిపించుకున్న సంగతీ తెలిసిందే.

అధికార బలాన్ని ఆ సమయంలో ఎంతగా ఉపయోగించారో అందరూ చూశారు. తమిళనాడు నుంచి జనాన్ని తెప్పించి దొంగ ఓట్లు వేయించిన సంగతి ఆధారాలతో బయటపెట్టారు తెలుగుదేశం మద్దతుదారులు. ఏదైతేనేం.. చివరికి అక్కడ వైసీసీనే గెలిచింది.

కానీ అక్కడ గెలిచిన ఆనందం వైకాపా కౌన్సిలర్లలోనే లేదనడానికి రుజువు తాజాగా బయటికి వచ్చిన ఒక వీడియో. మున్సిపల్ సమావేశం సందర్భంగా ఒక కౌన్సిలర్ భర్త మున్సిపల్ కమిషనర్‌ను బిల్లుల విషయంలో నిలదీశాడు.

ఇంతింత ఖర్చు పెట్టుకుని గెలిస్తే చిన్న చిన్న పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా ఓటుకు ఐదు వేల రూపాయలు పంచి గెలిచామంటూ అతను నోరు జారాడు. కౌన్సిలర్ భర్త అయిన అతను.. కమిషనర్ ముందు ఇలా మాట్లాడుతూ, నిలదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ ఎలా గెలిచిందో చెప్పడానికి రుజువు ఇదని, ఇదీ ఒక గెలుపేనా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ గెలుపు విషయంలో ఆ పార్టీ నాయకులకే ఆనందం లేదని, రాష్ట్రమంతటా ఉన్నట్లే ఇక్కడ కూడా బిల్లులు రాక వైకాపా నేతలే ఇబ్బంది పడుతున్నారంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది.

This post was last modified on November 1, 2022 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

1 hour ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

1 hour ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

2 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

3 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

3 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

5 hours ago