Political News

వైసీపీ డ్రామా బయటపడిపోయిందే

అమరావతి రాజధాని విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న డ్రామా అంతా తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని.. అక్కడి నుంచి రాజధాని ఎక్కడికీ పోదని.. కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయిస్తామని.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెబుతున్నారు.

అమరావతిని ఎందుకు నాశనం చేస్తున్నారని ఎవ్వరడిగినా అది మూడు రాజధానుల్లో ఒకటిగా ఉంటుంది కదా.. దానికేమి అన్యాయం జరగట్లేదనే అంటున్నారు. కానీ అమరావతి అన్నది పేరుకే ఒక రాజధాని అని.. విశాఖపట్నంనే అసలైన రాజధానిగా మార్చాలన్నది వైకాపా అసలు వ్యూహం అన్నది అందరికీ తెలుసు. కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టడం రాయలసీమ వాసులను మభ్యపెట్టడానికి చేస్తున్న కంటితుడుపు చర్చ అన్నది కూడా స్పష్టం. కానీ ఈ విషయాలను పైకి వైకాపా నేతలెవవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు.

కానీ శ్రీకాకుళం సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. విశాఖ వాసుల్లో ఎమోషన్ పెంచే క్రమంలో తాజాగా నోరు జారేశారు. వైకాపా ఆడుతున్న డ్రామాను బయటపెట్టేశారు. రాజ్యాంగంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా మూడు రాజధానులు అనేది లేదని.. అది పేరుకు మాత్రమే అని.. రేప్పొద్దున పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. అదే అసలైన రాజధాని అని వికేంద్రీకరణ మీద విశాఖలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ధర్మాన స్పష్టంగా చెప్పేశారు.

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు అందరూ అక్కడికి వెళ్తారని.. కర్నూలులో కోర్టు ఉంటుందని.. అంతకుమించి అక్కడేమీ ఉండదు అనే రకంగా మాట్లాడిన ఆయన.. విశాఖలో మొత్తం పరిపాలన అంతా కేంద్రీకృతం అవుతుందని.. ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం వదులుకోకూడదని జనాలకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు వైరల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న డ్రామా ఇదంటూ ఆ పార్టీ అసలు స్వరూపాన్ని నెటిజన్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

This post was last modified on November 1, 2022 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

27 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago