Political News

వైసీపీ డ్రామా బయటపడిపోయిందే

అమరావతి రాజధాని విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న డ్రామా అంతా తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని.. అక్కడి నుంచి రాజధాని ఎక్కడికీ పోదని.. కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయిస్తామని.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెబుతున్నారు.

అమరావతిని ఎందుకు నాశనం చేస్తున్నారని ఎవ్వరడిగినా అది మూడు రాజధానుల్లో ఒకటిగా ఉంటుంది కదా.. దానికేమి అన్యాయం జరగట్లేదనే అంటున్నారు. కానీ అమరావతి అన్నది పేరుకే ఒక రాజధాని అని.. విశాఖపట్నంనే అసలైన రాజధానిగా మార్చాలన్నది వైకాపా అసలు వ్యూహం అన్నది అందరికీ తెలుసు. కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టడం రాయలసీమ వాసులను మభ్యపెట్టడానికి చేస్తున్న కంటితుడుపు చర్చ అన్నది కూడా స్పష్టం. కానీ ఈ విషయాలను పైకి వైకాపా నేతలెవవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు.

కానీ శ్రీకాకుళం సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. విశాఖ వాసుల్లో ఎమోషన్ పెంచే క్రమంలో తాజాగా నోరు జారేశారు. వైకాపా ఆడుతున్న డ్రామాను బయటపెట్టేశారు. రాజ్యాంగంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా మూడు రాజధానులు అనేది లేదని.. అది పేరుకు మాత్రమే అని.. రేప్పొద్దున పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. అదే అసలైన రాజధాని అని వికేంద్రీకరణ మీద విశాఖలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ధర్మాన స్పష్టంగా చెప్పేశారు.

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు అందరూ అక్కడికి వెళ్తారని.. కర్నూలులో కోర్టు ఉంటుందని.. అంతకుమించి అక్కడేమీ ఉండదు అనే రకంగా మాట్లాడిన ఆయన.. విశాఖలో మొత్తం పరిపాలన అంతా కేంద్రీకృతం అవుతుందని.. ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం వదులుకోకూడదని జనాలకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు వైరల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న డ్రామా ఇదంటూ ఆ పార్టీ అసలు స్వరూపాన్ని నెటిజన్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

This post was last modified on November 1, 2022 5:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

16 mins ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

21 mins ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

3 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

3 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

8 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

10 hours ago