ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు వరుసగా అధికారంలోకి తీసుకున్న నాయకుడిగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరుంది. వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్గా నాటి రోజులు తలపిస్తాయి. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ను బలోపేతం చేశారు. అధికారంలోకి తెచ్చారు. అలాంటి నాయకుడి పట్ల కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం కానీ.. ఢోకా కానీ లేదు. వైఎస్ సెంటిమెంటు ఎక్కడ అవసరం ఉన్నా.. ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా వైఎస్ మావాడే.. అంటూ.. ఆయన కుమార్తెపైనే రాజకీయ దాడి చేశారు.
మరి అలాంటి వైఎస్ను ప్రస్తుతం కాంగ్రెస్ ఎందుకో మరచిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పోనీ.. మరిచిపోకపోయినా.. ఏమరుపాటుగా అయినా.. ఆయన తలంపు లేకుండా పోయింది. దీంతో హోరా హోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల పోరాటంలో వైఎస్ బొమ్మను కానీ, ఆయన పేరును కానీ.. కాంగ్రెస్ నేతలు తలుచుకోవడం లేదు. కనీసం.. పట్టించుకోవడం కూడా లేదు. వైఎస్ పాదయాత్రలో నల్లగొండలో పర్యటించిన సమయంలో ఇక్కడి ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలు విన్నారు. ఈ క్రమంలోనే తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రయత్నాలు సాగాయి. అయితే, ఇదే సమస్య ప్రస్తుత ఏపీలోని తూర్పుగోదావరి, శ్రీకాకుళం ప్రాంతాల్లోనూ ఉంది. దీంతో ఉమ్మడిగా ఒక పరిష్కారం చూపాలని అనుకున్నారు.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అంతో ఇంతో మునుగోడు ప్రజల్లో వైఎస్ పేరు నానుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం లేదు. కనీసం..వైఎస్ పేరు కూడా ఎక్కడా స్మరించడం లేదు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు వైఎస్ ను వదిలేశారు. అయితే.. ఇక్కడే చిత్రంగా బీజేపీ నేతలు వైఎస్ను అందిపుచ్చుకున్నారు. ఆయన వేష ధారణలో ఉన్న ఒక వ్యక్తిని నియమించి.. ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. ఈయన కూడా అచ్చు వైఎస్ మాదిరిగానే ఉండడం.. ఆయన హావ భావాలే పలికిస్తుండడం ఆసక్తిగా మారింది.
అంతేకాదు.. “మునుగోడు గడ్డ.. రాజగోపాల్ అడ్డా.. ఎన్ని పార్టీలు ఏకమైనా రాజగోపాల్రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు. నమస్తే.. నమస్తే.. ” అంటూ వైఎస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈయన వల్ల ఓట్లు పడతాయా లేదా, అనే విషయాన్ని పక్కన పెడితే వైఎస్ ను వదిలేయడం మాత్రం కాంగ్రెస్కు ఇబ్బంది అనేది తెలుస్తోంది.
This post was last modified on October 31, 2022 9:53 am
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…