Political News

ఎవ‌రు ఎవ‌రికి బానిస‌లు అంబ‌టి స‌ర్‌!!

ఔను! తాజాగా ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబ‌టి తీవ్ర‌మైన వ్యాఖ్య చేశారు. ఇది ఆయ‌న స్థాయికి అంటే.. మంత్రిగా త‌గ‌ని వ్యాఖ్య‌. ఏ గ‌ల్లీ నాయ‌కుడో లేక పోతే మంత్రి ప‌ద‌విలో లేని నాయ‌కుడో చేస్తే.. వేరేగా ఉండేది. కానీ, ఆయ‌నే నోరు పారేసుకున్నారు. బానిస‌సేన అధ్య‌క్షుడు .. మ‌ళ్లీ వ‌చ్చాడండి రాష్ట్రానికి అని ట్వీట్ చేశారు. దీనిపై అప్పుడే జ‌న‌సేన నేత‌లు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా ఏపీలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెండు రోజుల పార్టీ స‌మావేశం పెట్టుకున్నారు.

జన‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ(పీఏసీ) స‌మావేశం మంగ‌ళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రుగుతోంది. దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ‌చ్చారు. దీనిని ఉద్దేశించి అంబ‌టి చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. అంబ‌టివ్యాఖ్య‌లకు కౌంట‌ర్‌గా జ‌న‌సేన నేత‌లు.. ఎవ‌రు ఎవ‌రికి బానిస‌లు అని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తీసుకువ‌స్తాన‌ని, పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన మీరు కేంద్రానికి బానిస‌లుగా మార‌లేదా? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. జ‌గ‌న్ మెప్పుకోసం, మంత్రి ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం.. మీరు జ‌గ‌న్ ముందు బానిస‌లు మోక‌రిల్ల‌డం లేదా? అని నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికే వైసీపీ, జ‌న‌సేనల మ‌ధ్య‌తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. విశాఖ‌లో జ‌న‌సేన జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుని, ఆ పార్టీ కార్య‌కర్త‌ల‌పై కేసులు పెట్ట‌డాన్ని నాయ‌కులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్ర రాజ‌కీయాల‌ను అంతో ఇంతో దారికి తెచ్చే బాధ్య‌త మంత్రుల‌పైనే ఉంది.

సంయ‌మ‌నం పాటిస్తూ.. ఉండాల్సింది ప‌దవుల్లో ఉన్న మంత్రుల‌దే. అయితే.. దీనిని వ‌దిలేసి ఒక‌ట‌ని.. నాలుగు అనిపించుకునేలా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాష్ట్రంలో రాజ‌కీయ అస్థిర‌త‌కు ఆజ్యం పోస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా మంత్రులు మార‌తారో లేదో చూడాలి. చేసేందుకు చాలానే ప‌ని ఉంది. రాష్ట్రంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. వాటిని వినే ఓపిక తీరిక లేని మంత్రులు ఇలా రాజ‌కీయాలురెచ్చ‌గొట్టేలా చేయ‌డం స‌మంజ‌స‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌.

This post was last modified on October 30, 2022 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

2 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

3 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

4 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

6 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

7 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

7 hours ago