అప్పట్లో అంటే గత ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి, అధికారంలో ఉన్న టీడీపీకి ముందు జోరు యుద్ధం సాగింది. నువ్వా-నేనా అనే రేంజ్లో రాజకీయాలు సాగాయి. ఈ క్రమంలోనే 2019లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ ఎన్టీఆర్ బయోపిక్ను సినిమాగా తీసుకువచ్చిందనే ప్రచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ స్థానంలో ఉండి.. ఆయన పాత్రను పోషించారు. ఈ క్రమంతో ఎన్టీఆర్ సినిమా తెరమీదికి వచ్చింది. ఇక, దీనికి పోటీగా..రాంగోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను అప్పుడు తెరమీదకి ఎక్కించాడు.
అయితే.. అప్పట్లో వర్మ వెనుక ఎవరు ఉన్నారనేది తెలియదు. కానీ, ఆయన మాత్రం టీడీపీలో జరిగిన 1995 ఎపిసోడ్ కేంద్రంగా సినిమా తీశారు. ఇక అదేసమయంలో వైసీపీ కి చెందిన ఒక నాయకుడు నేతృత్వంలో వైఎస్ పాదయాత్ర నేపథ్యంగా ఒక సినిమాను తీసుకువచ్చారు. ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. వైఎస్గా ఆయన చేసిన నటన అదరహో అనిపించింది. ఇలా.. టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సినిమాలు తీసి ఎన్నికలకు ముందు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
అయితే.. ఇప్పుడు రాజకీయాలు మారాయి. వైసీపీకి పోటీగా.. జనసేన రంగంలోకి దిగింది. టీడీపీ స్థాయిలో ఎమ్మెల్యేలు లేకపోయినా..వైసీపీకి ప్రత్యా మ్నాయం మేమే అన్నట్టుగా జనసేన చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలోనే సవాళ్లు ప్రతిసవాళ్లు సైతం రువ్వుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమాల వరకు కూడా వచ్చింది. తాజాగా వర్మ.. సీఎం జగన్ తో భేటీ అయినతర్వాత..తాను వ్యూహం, శపథం అనే సీక్వెల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ రెండు కూడా రాజకీయ అరాచకాలకు ప్రతిబింబంగా ఉంటాయని కూడా పేర్కొన్నాడు.
ఇక, ఈ ప్రకటన వచ్చిన వెంటనే టీడీపీ రియాక్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా జనసేన రియాక్ట్ అయింది. తాము కూడా త్వరలోనే ‘ప్రతివ్యూహం’ అనే మూవీని తీయనున్నట్టు తెలిపింది. అది కూడా.. వర్మ వ్యూహం మూవీని విడుదల చేసే రోజే విడుదల చేయనున్నట్టు నూతన్ నాయుడు అనే వ్యక్తి సంచలన ప్రకటన చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వ అరాచకాలను కళ్లకు కడుతుందని తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీ-జనసేన పోటా పోటీ సినిమాలు తీయడం ఖాయమైపోయినట్టేననే చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on October 30, 2022 2:28 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…