రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంతసేపూ.. కేంద్రంపైనే ఆధారపడాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచన ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్రనాయకుల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఇదే విషయంపై కొందరు నాయకులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు. రాష్ట్రం లోని రెండు ప్రదాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మరి మన సంగతి ఏంటి? అనివారు ప్రశ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ అయినా.. నియోజకవర్గాల వారీగా.. సమీక్షలు చేస్తున్నాయి. నాయకులకు అలెర్టు చేస్తున్నారు.
కొందరికి ఇంపార్టెంట్ అనుకున్న వారికి టికెట్లు కూడా.. కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి.. నాయకులు కలిసి కట్టుగా.. కదనరంగంలోకి దింపేలా వ్యూహాత్మకంగా వైసీపీ, టీడీపీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో అంతో ఇంతో ఆయా పార్టీల్లో జోష్ కనిపిస్తోం ది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న బీజేపీ నాయకులు.. వచ్చే ఎన్నికల నాటికి మనపరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కొందరు భావిస్తున్నారు. దీంతో సమీక్షలకు పట్టుబడుతున్నారు.
నిజానికి సోము వీర్రాజు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆయనకు కూడా.. పార్టీని బలోపేతం చేయాలనే ఉంది. కానీ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసేందుకు.. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేకుండా పోయారు. దీంతో ఆయన ఈవిషయంలో సైలెంట్ అయిపోయారు. ఎక్కడ చూసుకున్నా.. నాయకుల కొరత పార్టీని వెంటాడుతోంది. పైకి ఎంతో గంభీరంగా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని.. చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వెనుదిరిగి చూసుకుంటే మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
ఎక్కడా కూడా.. ఆశించిన స్థాయిలో నాయకులు లేరు. 175 నియోజకవర్గాల్లో పట్టుమని 60 మంది కూడా నాయకులు నికరంగా.. పార్టీకి కనిపించడం లేదు. పోనీ.. పార్టీలో నేతలు లేరా.. అంటే, ఉన్నారు. కానీ, వారంతా.. పోటీలో నిలిచి గెలిచే క్యాండెట్లు కారు. సో.. ఈ పరిణామాలతోనే.. నియోజకవర్గాల సమీక్ష కానీ, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన కానీ.. బీజేపీ చేయడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 30, 2022 2:13 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…