రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంతసేపూ.. కేంద్రంపైనే ఆధారపడాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచన ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్రనాయకుల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఇదే విషయంపై కొందరు నాయకులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు. రాష్ట్రం లోని రెండు ప్రదాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మరి మన సంగతి ఏంటి? అనివారు ప్రశ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ అయినా.. నియోజకవర్గాల వారీగా.. సమీక్షలు చేస్తున్నాయి. నాయకులకు అలెర్టు చేస్తున్నారు.
కొందరికి ఇంపార్టెంట్ అనుకున్న వారికి టికెట్లు కూడా.. కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి.. నాయకులు కలిసి కట్టుగా.. కదనరంగంలోకి దింపేలా వ్యూహాత్మకంగా వైసీపీ, టీడీపీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో అంతో ఇంతో ఆయా పార్టీల్లో జోష్ కనిపిస్తోం ది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న బీజేపీ నాయకులు.. వచ్చే ఎన్నికల నాటికి మనపరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కొందరు భావిస్తున్నారు. దీంతో సమీక్షలకు పట్టుబడుతున్నారు.
నిజానికి సోము వీర్రాజు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆయనకు కూడా.. పార్టీని బలోపేతం చేయాలనే ఉంది. కానీ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసేందుకు.. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేకుండా పోయారు. దీంతో ఆయన ఈవిషయంలో సైలెంట్ అయిపోయారు. ఎక్కడ చూసుకున్నా.. నాయకుల కొరత పార్టీని వెంటాడుతోంది. పైకి ఎంతో గంభీరంగా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని.. చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వెనుదిరిగి చూసుకుంటే మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
ఎక్కడా కూడా.. ఆశించిన స్థాయిలో నాయకులు లేరు. 175 నియోజకవర్గాల్లో పట్టుమని 60 మంది కూడా నాయకులు నికరంగా.. పార్టీకి కనిపించడం లేదు. పోనీ.. పార్టీలో నేతలు లేరా.. అంటే, ఉన్నారు. కానీ, వారంతా.. పోటీలో నిలిచి గెలిచే క్యాండెట్లు కారు. సో.. ఈ పరిణామాలతోనే.. నియోజకవర్గాల సమీక్ష కానీ, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన కానీ.. బీజేపీ చేయడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…