Political News

ఎన్టీఆర్ కు సీఎం ఆహ్వానం.. తెర‌వెనుక బీజేపీ?

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ విష‌యంలో క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ బొమ్మై ప్ర‌మేయం ఉంద‌ని అంటున్నారు. పైగా.. బీజేపీ కూడా ఉంద‌నే గుస‌గుస కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ను ఆక‌స్మికంగా అసెంబ్లీకి రావాల‌ని ఆహ్వానించ‌డం వెనుక బీజేపీ ఖ‌చ్చితంగా ఉంద‌నే చ‌ర్చ‌సాగుతోంది.

వాస్త‌వానికి తారక్.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో తారక్ కర్ణాటక ప్రయాణంపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలో కర్ణాటక ప్రభుత్వం తారక్ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి రావడానికి తారక్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.

అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు. ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్ రాజ్కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు పునీత్. అయితే, తెలుగులోఎంతో మంది న‌టులు ఉన్న‌ప్ప‌టికీ తార‌క్‌నే ఎందుకు పిలిచార‌నేది రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే..
ఇటీవ‌ల కొన్ని రోజుల కింద‌ట అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఎంతో బిజీగా ఉండి కూడా.. జూనియ‌ర్‌తో భేటీ అయ్యారు. 30 నిమిషాల పాటు చ‌ర్చించుకున్నారు. అయితే.. ఏం మాట్లాడుకున్నార‌నేది తెలియ‌దు. కానీ, రాజ‌కీయంగా అది ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, ఇప్పుడు బీజేపీ పాలిత క‌ర్ణాట‌క నుంచి తార‌క్‌కు ఆహ్వానం అందండ వెనుక పొలిటిక‌ల్ రీజనే ఉంటుంద‌ని అంటున్నారు. కార్య‌క్ర‌మం ఏదైనా.. జూనియ‌ర్‌ను ముగ్గులోకి లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే గుస‌గు స వినిపిస్తుండ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on October 30, 2022 8:01 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

6 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

8 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

8 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

10 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

13 hours ago