ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? తమిళసినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్లా ఉన్నాడు కదూ! కానీ, కాదు. మనోడో.. మన పాలే! మునుగోడు ఉప ఎన్నికలో తనదైన శైలిలోదూసుకుపోతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, శాంతి దూతగా చెప్పుకొనే కేఏ పాలే తాజాగా ఈ వేషం కట్టారు. పక్కా రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు.
చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు పాల్. తలకు కండువా కట్టుకుని పొలాలకు వెళ్లి అన్నదాతలతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు… అనంతరం సైకిల్ తొక్కుతూ ఓటర్లను కలిశారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ , బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి జరగబోదని, ఓట్ల కోసం డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇటీవలకాలంలో పాల్ తనదైన శైలిలో ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉండడం, వారితో కలిసి మాట్లాడడం, టీ తాగడం, సెలూన్ కు వెళ్లినా.. క్షణం వేస్ట్ చేయకుండా.. అక్కడకు కూడా మీడియాను పిలుచుకుని ప్రచారం చేయడం తెలిసిందే. ఇక, కొన్ని కొన్ని మండలాల్లో అయితే.. ఆయన డ్యాన్స్ వేసి మరీ యువతను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పాల్ వేస్తున్న ‘వేషాలు’ ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. అన్నట్టు ప్రధాన పార్టీలను మించిపోయిన రీతిలో పాల్ ప్రచారం చేస్తుండడం విశేషం. ఒక్కొక్కసారి.. ఇలాంటి వారు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి పాల్ రొట్టె విరిగి నేతిలో పడుతుందో.. పొయ్యిలో పడుతుందో చూడాలి.
This post was last modified on October 29, 2022 6:29 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…