ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? తమిళసినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్లా ఉన్నాడు కదూ! కానీ, కాదు. మనోడో.. మన పాలే! మునుగోడు ఉప ఎన్నికలో తనదైన శైలిలోదూసుకుపోతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, శాంతి దూతగా చెప్పుకొనే కేఏ పాలే తాజాగా ఈ వేషం కట్టారు. పక్కా రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు.
చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు పాల్. తలకు కండువా కట్టుకుని పొలాలకు వెళ్లి అన్నదాతలతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు… అనంతరం సైకిల్ తొక్కుతూ ఓటర్లను కలిశారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ , బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి జరగబోదని, ఓట్ల కోసం డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇటీవలకాలంలో పాల్ తనదైన శైలిలో ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉండడం, వారితో కలిసి మాట్లాడడం, టీ తాగడం, సెలూన్ కు వెళ్లినా.. క్షణం వేస్ట్ చేయకుండా.. అక్కడకు కూడా మీడియాను పిలుచుకుని ప్రచారం చేయడం తెలిసిందే. ఇక, కొన్ని కొన్ని మండలాల్లో అయితే.. ఆయన డ్యాన్స్ వేసి మరీ యువతను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పాల్ వేస్తున్న ‘వేషాలు’ ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. అన్నట్టు ప్రధాన పార్టీలను మించిపోయిన రీతిలో పాల్ ప్రచారం చేస్తుండడం విశేషం. ఒక్కొక్కసారి.. ఇలాంటి వారు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి పాల్ రొట్టె విరిగి నేతిలో పడుతుందో.. పొయ్యిలో పడుతుందో చూడాలి.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…