Political News

విశాఖ‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న ‘మార్చ్‌!’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ను విడిచి పెట్ట‌డం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయ‌కులు గ‌ర్జ‌న పేరుతో హ‌ల్చ‌ల్ చేశారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయాల‌నే డిమాండ్‌తో వైసీపీ నేత‌లు ఇక్క‌డ ర్యాలీ నిర్వ‌హించారు.ఆ త‌ర్వాత విశాఖ విమానాశ్ర‌యంంలో ఏర్ప‌డిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా ప‌వ‌న్‌కు, వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య భారీ గ్యాప్ పెంచేసింది. కేసులు, కోర్టుల జోక్యం వ‌ర‌కు కూడా వెళ్లింది. ఇక‌, ప‌వ‌న్‌ను అక్క‌డి నుంచి పోలీసులు పంపేశారు.

ఇదిలావుంటే, తాజాగా ప‌వ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ‌ను దోచేసేందుకే వైసీపీ నాయ‌కులు ఇక్క‌డ రాజ‌ధాని కోరుతున్నార‌ని.. కొన్ని రోజుల నుంచి చెబుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇప్పుడు ఇదే వాయిస్‌ను మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న వ‌చ్చే 3న విశాఖ‌లో లాంగ్ మార్చ్‌కు రెడీ అయ్యారు.

“చ‌లో విశాఖప‌ట్నం
ఒక్క‌టిగా న‌డుద్దాం
ఒక విప్ల‌వ ఉప్పెనై బ‌లంగా వీద్దాం
ఒక బ‌ల‌మైన నిర‌స‌న గ‌ళాన్ని వినిపిద్దాం
ఉపాధి కోల్పోయిన ల‌క్ష‌లాది మంది కోసం”

  • అని ప్ర‌చారం పోస్ట‌ర్‌లో పేర్కొన్నారు.

వ‌చ్చే నెల 3వ తారీకు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ఈ లాంగ్ మార్చ్ నిర్వ‌హిస్తున్న‌ట్టు పోస్ట‌ర్‌లోనే పేర్కొన్నారు. మ‌రి ఈ మార్చ్‌కు పోలీసులు అనుమ‌తించారో.. అనుమ‌తించాలో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప‌వ‌న్ ప‌ట్టువీడ‌కుండా స‌ర్కారుపై పోరాటం చేయ‌డం ఆస‌క్తిగా మారింది. చివ‌ర‌కు ఏం తేలుతుందో చూడాలి. యువ‌త స‌మీక‌ర‌ణ తేలికే అయినా సీనియ‌ర్ల‌ను, మేదావుల‌ను మాత్రం ముందుకు న‌డిపించాల్సి ఉంటుంది. ఇక‌, ఈ మార్చ్‌కు పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు క‌లిసివ‌స్తారో లేదో కూడా చూడాలి. ముఖ్యంగా బీజేపీ పొత్తులో ఉంది క‌నుక క‌నీసం ఈ పార్టీ ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌తో క‌లిసి అడుగులు వేస్తుందో లేదో తెలియాలంటే 3వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on October 29, 2022 6:23 pm

Share

Recent Posts

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

13 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

39 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 hour ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

1 hour ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago