జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖను విడిచి పెట్టడం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయకులు గర్జన పేరుతో హల్చల్ చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలనే డిమాండ్తో వైసీపీ నేతలు ఇక్కడ ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంంలో ఏర్పడిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా పవన్కు, వైసీపీ నేతలకు మధ్య భారీ గ్యాప్ పెంచేసింది. కేసులు, కోర్టుల జోక్యం వరకు కూడా వెళ్లింది. ఇక, పవన్ను అక్కడి నుంచి పోలీసులు పంపేశారు.
ఇదిలావుంటే, తాజాగా పవన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖను దోచేసేందుకే వైసీపీ నాయకులు ఇక్కడ రాజధాని కోరుతున్నారని.. కొన్ని రోజుల నుంచి చెబుతున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇదే వాయిస్ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన వచ్చే 3న విశాఖలో లాంగ్ మార్చ్కు రెడీ అయ్యారు.
“చలో విశాఖపట్నం
ఒక్కటిగా నడుద్దాం
ఒక విప్లవ ఉప్పెనై బలంగా వీద్దాం
ఒక బలమైన నిరసన గళాన్ని వినిపిద్దాం
ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కోసం”
వచ్చే నెల 3వ తారీకు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు పోస్టర్లోనే పేర్కొన్నారు. మరి ఈ మార్చ్కు పోలీసులు అనుమతించారో.. అనుమతించాలో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ పట్టువీడకుండా సర్కారుపై పోరాటం చేయడం ఆసక్తిగా మారింది. చివరకు ఏం తేలుతుందో చూడాలి. యువత సమీకరణ తేలికే అయినా సీనియర్లను, మేదావులను మాత్రం ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఇక, ఈ మార్చ్కు పార్టీలకు అతీతంగా నాయకులు కలిసివస్తారో లేదో కూడా చూడాలి. ముఖ్యంగా బీజేపీ పొత్తులో ఉంది కనుక కనీసం ఈ పార్టీ ఇప్పటికైనా పవన్తో కలిసి అడుగులు వేస్తుందో లేదో తెలియాలంటే 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 29, 2022 6:23 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…