జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖను విడిచి పెట్టడం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయకులు గర్జన పేరుతో హల్చల్ చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలనే డిమాండ్తో వైసీపీ నేతలు ఇక్కడ ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంంలో ఏర్పడిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా పవన్కు, వైసీపీ నేతలకు మధ్య భారీ గ్యాప్ పెంచేసింది. కేసులు, కోర్టుల జోక్యం వరకు కూడా వెళ్లింది. ఇక, పవన్ను అక్కడి నుంచి పోలీసులు పంపేశారు.
ఇదిలావుంటే, తాజాగా పవన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖను దోచేసేందుకే వైసీపీ నాయకులు ఇక్కడ రాజధాని కోరుతున్నారని.. కొన్ని రోజుల నుంచి చెబుతున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇదే వాయిస్ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన వచ్చే 3న విశాఖలో లాంగ్ మార్చ్కు రెడీ అయ్యారు.
“చలో విశాఖపట్నం
ఒక్కటిగా నడుద్దాం
ఒక విప్లవ ఉప్పెనై బలంగా వీద్దాం
ఒక బలమైన నిరసన గళాన్ని వినిపిద్దాం
ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కోసం”
వచ్చే నెల 3వ తారీకు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు పోస్టర్లోనే పేర్కొన్నారు. మరి ఈ మార్చ్కు పోలీసులు అనుమతించారో.. అనుమతించాలో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ పట్టువీడకుండా సర్కారుపై పోరాటం చేయడం ఆసక్తిగా మారింది. చివరకు ఏం తేలుతుందో చూడాలి. యువత సమీకరణ తేలికే అయినా సీనియర్లను, మేదావులను మాత్రం ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఇక, ఈ మార్చ్కు పార్టీలకు అతీతంగా నాయకులు కలిసివస్తారో లేదో కూడా చూడాలి. ముఖ్యంగా బీజేపీ పొత్తులో ఉంది కనుక కనీసం ఈ పార్టీ ఇప్పటికైనా పవన్తో కలిసి అడుగులు వేస్తుందో లేదో తెలియాలంటే 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 29, 2022 6:23 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…