Political News

తుమ్మ‌ల బ్యాక్.. టీడీపీలో జోష్‌!

సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హిత నేత‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అంద‌రికీ సుప‌రిచితులే. తెలంగాణలోని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆయ‌న టీడీపీలో ఉండ‌గా మంత్రిగా కూడా ప‌నిచేశారు. జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత టీడీపీ కొంత వెనుక బ‌డ‌డంతో ఆయ‌న త‌న రాజ‌కీయాల‌ను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఇక్క‌డ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న టీడీపీ సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?
తెలంగాణ ఏర్ప‌డ‌క‌ముందు వ‌ర‌కు టీడీపీలో ఉన్న తుమ్మ‌ల ఉమ్మ‌డి ఖ‌మ్మంలో ఎదురులేని నాయ‌కుడిగా చ‌క్రం తిప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక కూడా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు చంద్ర‌బాబుకు ఎంతో ముఖ్య‌నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌డం, చంద్ర‌బాబు ఒకానొక‌ద‌శ‌లో తెలంగాణ టీడీపీని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు కూడా ఆయ‌న స‌న్నిహిత నాయ‌కుడిగా మారిపోయారు. ఖ‌మ్మంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యంద‌క్కించుకుని కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం తుమ్మ‌ల‌కు ఓట‌మి ఎదురైంది. అయినా ఆయ‌న పార్టీకోసం ప‌నిచేస్తూనే ఉన్నారు. కానీ, ఇక్క‌డ నుంచి గెలిచిన కాంగ్రెస్‌నేత ఉపేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేర‌డం, ఆయ‌న‌కు కేటీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో తుమ్మ‌ల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న టీడీపీవైపు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజర‌య్యారు.

ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ పాల‌న‌ను కొనియాడారు.అనంతంర స‌త్తుప‌ల్లిలో నిర్వ‌హించి బైక్ ర్యాలీలోనూ ఆయ‌న పార్టిసిపేట్ చేశారు. ఎన్టీఆరే త‌న‌కు రాజ‌కీయ జ‌న్మ ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను తిరిగి టీడీపీలోకి రావాలంటూ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. 2018లో తీవ్ర స‌మ‌రం జ‌రిగినా టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. తుమ్మ‌ల రావాల‌ని కొంద‌రు ప‌ట్టుబ‌ట్టారు.

ఇక తుమ్మ‌ల క‌నుక టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఖ‌చ్చితంగా పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 2023లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే లెక్క‌లు వేస్తున్నారు. ఇటీవ‌లే కాసాని జ్ఞానేశ్వ‌ర్ చేరిక‌తో బీసీలు అంద‌రూ ఇప్పుడు మ‌రోసారి టీడీపీవైపు చూస్తున్నారు. మ‌రి తుమ్మ‌ల ఏం చేస్తారో చూడాలి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న‌కు బెస్ట్ ఆప్ష‌న్ టీడీపీయేన‌ని ఆయ‌న అనుచ‌రులు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 29, 2022 6:26 pm

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

32 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

36 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago