మూడు రాజధానుల విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ప్రజలను ఏమేరకు ఒప్పిస్తున్నారో తెలియదు కానీ, వారిలో వారే వింత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విశాఖ రాజధానికి మద్దతుగా గర్జన నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. ‘వైసీపీ ఆత్మగౌరవ మహా ప్రదర్శన’ పేరుతో భారీ ర్యాలీకి రెడీ అయింది. అయితే, దీనిపై రాయల సీమలోని వైసీపీ నేతల్లో భిన్న వైఖరి వ్యక్తమైంది. దీనికి మద్ధతుగా కొందరు నిలిస్తే.. ఇలాంటి కార్యక్రమమే అవసరం లేదని మరికొందరు అంటున్నారు. దీంతో ఇది వైసీపీలోనే మంటలు రేపడం గమనార్హం.
విశాఖ గర్జన తరహాలో సీమ జిల్లాల్లో తొలిసారిగా తిరుపతిలో “రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన” పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఈ ప్రదర్శన తలపెట్టారు. అయితే.. దీనిపై స్పందించిన సీమ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అలాంటివి అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, రాయలసీమకు పరిపాలనా రాజాధాని అవసరం లేదని.. న్యాయ రాజధాని సరిపోతుందన్నారు.
భారీ ఎత్తున ఫ్లెక్సీలు..
మరోవైపు తిరుపతిలో నిర్వహించే ర్యాలీకి భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోరుకొనే వారంతా చేతులు కలపండి’, ‘అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ నినాదాలతో రాయలసీమ పరిరరక్షణ సమితి, మానవవికాస వేదికలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు మూడు రాజధానులకు మద్ధతుగా ముద్రించిన కరపత్రాల పంపిణీ చేపట్టారు.
శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమకు రాజధాని ఆవశ్యకత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మూడు రాజధానులకు ప్రజలు మద్ధతు కూడగట్టడం ద్వారా వైసీపీ ప్రయోజనాలు కాపాడే లక్ష్యంగా మహాప్రదర్శన సాగనుంది. ప్రజలను చైతన్యం చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణకు మద్ధతు కూడగడతామని కరుణాకరరెడ్డి ప్రకటించారు.
మూడు రాజధానులకు మద్ధతుగా మహా ప్రదర్శనకు కరుణాకరెడ్డి సారథ్యం వహిస్తుంటే.. అలాంటి ప్రదర్శనలు అవసరమే లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భిన్నంగా స్పందించడం ఇప్పుడు సీమలోని నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఒకే పార్టీకి చెందిన ప్రముఖ నేతలు భిన్నంగా స్పందించడం ఆపార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. తిరుపతి నగరవాసులతో మాత్రమే మహాప్రదర్శన అని ప్రకటించినప్పటికీ సీమ జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు ర్యాలీలో పాల్గొననున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…