సాధారణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్తవారి ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో పనులు చేసుకుంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయంపై ఒక కోడలు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని తనను అత్తగారు పోరు పెడుపెడుతోందని.. ఇది క్రూరత్వమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇది చాలా స్పెషల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో పనులు కోడలు చేసుకోకపోతే ఎవరు చేస్తారని ప్రశ్నించింది. అసలు ఈ కేసు క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కోడలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త కోడలు.. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పని చేసేలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఏకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఇరు పక్షాల వాదనలు విన్నది. అంతేకాదు అసలు ఇంట్లో ఏం జరుగుతోందో చెప్పాలని రికార్డులు తీసుకురావాలని కూడా కోరింది.
అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. “ఒక వివాహిత అయిన కోడలును ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించు కోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.
This post was last modified on October 29, 2022 12:06 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…