సాధారణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్తవారి ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో పనులు చేసుకుంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయంపై ఒక కోడలు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని తనను అత్తగారు పోరు పెడుపెడుతోందని.. ఇది క్రూరత్వమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇది చాలా స్పెషల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో పనులు కోడలు చేసుకోకపోతే ఎవరు చేస్తారని ప్రశ్నించింది. అసలు ఈ కేసు క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కోడలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త కోడలు.. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పని చేసేలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఏకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఇరు పక్షాల వాదనలు విన్నది. అంతేకాదు అసలు ఇంట్లో ఏం జరుగుతోందో చెప్పాలని రికార్డులు తీసుకురావాలని కూడా కోరింది.
అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. “ఒక వివాహిత అయిన కోడలును ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించు కోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.
This post was last modified on October 29, 2022 12:06 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…