సాధారణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్తవారి ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో పనులు చేసుకుంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయంపై ఒక కోడలు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని తనను అత్తగారు పోరు పెడుపెడుతోందని.. ఇది క్రూరత్వమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇది చాలా స్పెషల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో పనులు కోడలు చేసుకోకపోతే ఎవరు చేస్తారని ప్రశ్నించింది. అసలు ఈ కేసు క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కోడలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త కోడలు.. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పని చేసేలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఏకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఇరు పక్షాల వాదనలు విన్నది. అంతేకాదు అసలు ఇంట్లో ఏం జరుగుతోందో చెప్పాలని రికార్డులు తీసుకురావాలని కూడా కోరింది.
అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. “ఒక వివాహిత అయిన కోడలును ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించు కోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.
This post was last modified on October 29, 2022 12:06 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…