Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే!

ఏపీలో వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే! అనే విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ముసాయిదాలో వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది.

ఇటీవల చేసిన సీఆర్డీఏ చట్ట సవరణ మేరకు ప్రత్యేకంగా ఈ జోన్ను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చింది. సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేశారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని పేర్కొంది. అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ సీఆర్డీఏ కార్యాలయంలో కానీ, ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అభ్యంతరాలు తెలియచేయవచ్చని తెలిపింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగా ఈ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు.

వాస్త‌వానికి గ‌త ఏడాదే.. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌ధానిలో భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ల‌బ్ధిదారుల‌ను కూడా ఎంపిక చేసింది. అయితే.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం ఏంట‌ని.. రాజ‌ధానిని ప‌క్క‌న ప‌డేయడం ఏంట‌ని రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన కోర్టు అలా చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, ఇప్పుడు తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మ‌రి దీని పై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…

4 hours ago

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…

6 hours ago

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

6 hours ago

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…

7 hours ago

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

8 hours ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

8 hours ago