Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే!

ఏపీలో వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే! అనే విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ముసాయిదాలో వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది.

ఇటీవల చేసిన సీఆర్డీఏ చట్ట సవరణ మేరకు ప్రత్యేకంగా ఈ జోన్ను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చింది. సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేశారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని పేర్కొంది. అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ సీఆర్డీఏ కార్యాలయంలో కానీ, ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అభ్యంతరాలు తెలియచేయవచ్చని తెలిపింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగా ఈ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు.

వాస్త‌వానికి గ‌త ఏడాదే.. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌ధానిలో భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ల‌బ్ధిదారుల‌ను కూడా ఎంపిక చేసింది. అయితే.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం ఏంట‌ని.. రాజ‌ధానిని ప‌క్క‌న ప‌డేయడం ఏంట‌ని రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన కోర్టు అలా చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, ఇప్పుడు తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మ‌రి దీని పై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago