Political News

111 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్ష పూర్తి.. బాబు ఏం తేల్చారంటే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 111 నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆయ‌న దృష్టి సారించారు. తా జాగా పార్టీ కార్యాల‌యం.. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. ఏకంగా.. 111 నియోజ‌క‌వర్గాల పై చంద్ర‌బాబు స‌మీక్ష పూర్తి చేయ‌డం.. నిజంగా రికార్డే. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తేల్చింది ఏంటి? పార్టీని గాడిలో పెట్టింది ఏంటి? నేత‌ల‌కు చేసిన సూచ‌న‌లు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. ఇన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేశారంటే..చంద్ర‌బాబు ఊరికేనే టైం వేస్ట్ చేసుకోరుక‌దా! సో.. ఆయ‌నేదోకీల‌క విష‌యాలే చెప్పి ఉంటార నే చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌య‌ట‌కు వెలుగు చూసిన కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. అంద‌రూ క‌లిసి మెలిసిముందుకు సాగాల‌ని మాత్రం చంద్ర‌బాబు అంద‌రికీ గ‌ట్టిగా చెప్పారు. ఈ విష‌యంలో ఆయ‌న ప‌క్కా సూచ‌న‌లు చేశారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ దెబ్బ‌తిన‌డానికి..గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కూడా.. ఈ స‌మైక్య‌త లేక‌పోవ‌డమే. సో… ఈ నేప‌థ్యంలో అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ను చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు.

మ‌రి చంద్ర‌బాబు అనుకున్న‌ది సాధించారా? అంటే.. ప్ర‌శ్న‌గానే క‌నిపిస్తోంది. ఆయ‌న 111 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్ష‌లు పూర్తి చేసినా.. వీటిలో స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టకు రాలేక పోతున్నారు. ఎవ‌రూ కూడా.. క‌లివిడిగా.. ముందుకు సాగాల‌నే తీర్మానం చేసుకున్న నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌టి కూడా క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీలో క‌లివిడి బాగా క‌నిపించింది. జ‌గ‌న్‌ను సీఎం ను చేసుకునేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గం అంద‌రినీ క‌లుపుకొనిపోయింది.

ఎక్క‌డో ఉన్న నాయ‌కుల‌ను కూడా.. ఏక‌తాటిపైకి తెచ్చి.. పార్టీని ముందుండి న‌డిపించారు చాలా మంది నాయ‌కులు. ఈ త‌ర‌హా సూత్ర‌మే చంద్ర‌బాబు ఎంచుకున్నార‌నేది వాస్త‌వం. అందుకే.. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను అలెర్ట్ చేశారు. వారికి కోన్ని దిశానిర్దేశాలు కూడా.. చేశారు. అయితే.. అనుకున్న విదంగా మాత్రం ఫ‌లితం రావ‌డం లేదు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే బెంగో.. లేక‌.. వైసీపీ బ‌లంగా ఉంది.. దీనికి ఢీ కొట్ట‌గ‌ల‌మో లేదో.. అనే చింతో అర్ధం కావ‌డం లేదు. కానీ, ప‌ని మాత్రం అయిపోయింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 29, 2022 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…

38 minutes ago

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…

1 hour ago

కొత్త రిస్కుకు రెడీ అవుతున్న మెగా హీరో

క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…

1 hour ago

ఎవరూ మాట్లాడ్డం లేదు విశ్వక్

కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…

3 hours ago

మౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడో

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…

4 hours ago

పొలిటిక‌ల్ చిత్రం: జ‌గ‌న్‌కు నాగ‌బాబు సూచ‌న‌లు.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు జ‌న‌సేన పార్టీముఖ్య నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. కీల‌క సూచ‌న‌లు చేశారు. అయితే.. జ‌గ‌న్ ఎవ‌రి మాటా…

5 hours ago