Political News

111 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్ష పూర్తి.. బాబు ఏం తేల్చారంటే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 111 నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆయ‌న దృష్టి సారించారు. తా జాగా పార్టీ కార్యాల‌యం.. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. ఏకంగా.. 111 నియోజ‌క‌వర్గాల పై చంద్ర‌బాబు స‌మీక్ష పూర్తి చేయ‌డం.. నిజంగా రికార్డే. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తేల్చింది ఏంటి? పార్టీని గాడిలో పెట్టింది ఏంటి? నేత‌ల‌కు చేసిన సూచ‌న‌లు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. ఇన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేశారంటే..చంద్ర‌బాబు ఊరికేనే టైం వేస్ట్ చేసుకోరుక‌దా! సో.. ఆయ‌నేదోకీల‌క విష‌యాలే చెప్పి ఉంటార నే చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌య‌ట‌కు వెలుగు చూసిన కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. అంద‌రూ క‌లిసి మెలిసిముందుకు సాగాల‌ని మాత్రం చంద్ర‌బాబు అంద‌రికీ గ‌ట్టిగా చెప్పారు. ఈ విష‌యంలో ఆయ‌న ప‌క్కా సూచ‌న‌లు చేశారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ దెబ్బ‌తిన‌డానికి..గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కూడా.. ఈ స‌మైక్య‌త లేక‌పోవ‌డమే. సో… ఈ నేప‌థ్యంలో అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ను చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు.

మ‌రి చంద్ర‌బాబు అనుకున్న‌ది సాధించారా? అంటే.. ప్ర‌శ్న‌గానే క‌నిపిస్తోంది. ఆయ‌న 111 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్ష‌లు పూర్తి చేసినా.. వీటిలో స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టకు రాలేక పోతున్నారు. ఎవ‌రూ కూడా.. క‌లివిడిగా.. ముందుకు సాగాల‌నే తీర్మానం చేసుకున్న నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌టి కూడా క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీలో క‌లివిడి బాగా క‌నిపించింది. జ‌గ‌న్‌ను సీఎం ను చేసుకునేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గం అంద‌రినీ క‌లుపుకొనిపోయింది.

ఎక్క‌డో ఉన్న నాయ‌కుల‌ను కూడా.. ఏక‌తాటిపైకి తెచ్చి.. పార్టీని ముందుండి న‌డిపించారు చాలా మంది నాయ‌కులు. ఈ త‌ర‌హా సూత్ర‌మే చంద్ర‌బాబు ఎంచుకున్నార‌నేది వాస్త‌వం. అందుకే.. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను అలెర్ట్ చేశారు. వారికి కోన్ని దిశానిర్దేశాలు కూడా.. చేశారు. అయితే.. అనుకున్న విదంగా మాత్రం ఫ‌లితం రావ‌డం లేదు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే బెంగో.. లేక‌.. వైసీపీ బ‌లంగా ఉంది.. దీనికి ఢీ కొట్ట‌గ‌ల‌మో లేదో.. అనే చింతో అర్ధం కావ‌డం లేదు. కానీ, ప‌ని మాత్రం అయిపోయింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 29, 2022 7:28 am

Share

Recent Posts

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

20 minutes ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

1 hour ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

6 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

6 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

6 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

6 hours ago