తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. తర్వాత.. జరిగిన పరిణామాలు.. వంటివి చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సారి కూడా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనే.. పవన్ భేటీ అయి నట్టు సమాచారం. అయితే.. ఈ క్రమంలో ప్రధానంగా.. పవన్తో బీజేపీ నేతలు చేసిన చర్చల సారాంశం ఒక్కటే అంటున్నారు పరిశీలకులు. అప్పుడే ఇతర పార్టీలతో పొత్తులు వద్దనే కీలక సూచన చేసినట్టు సమాచారం.
నిజానికి.. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తానని.. ఆ పార్టీకి.. ప్రభుత్వానికి బుద్ధి చెబుతానని.. పేర్కొంటూ.. పవన్ నేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చేతులు కలిపారు. ఈ పరిణామం.. బీజేపీని ఉత్కంఠకు గురి చేసింది. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకు లకు కంటిపై కునుకు లేకుండా చేసింది. తమకు కనీసం మాట కూడా చెప్పకుండానే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటనే విషయంపై.. చర్చ సాగింది. ఈ క్రమంలోనే సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి వచ్చారు.
అయితే.. అక్కడకూడా.. ఆయన పవన్తో పొత్తులో ఉన్నామని.. కానీ, మనకు చెప్పకుండానే వెళ్లి టీడీపీతో చేతులు కలిపారని.. వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై బీజేపీ కేంద్ర పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే.. పవన్ టీడీపీతో చేతులు కలపొచ్చా.. కలపకూడదా? అనే విషయంపై బీజేపీ పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని.. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ఉన్న పరిస్థితిని గమనించి.. అప్పుడు నిర్ణయం తీసుకుంటే మేలనే రీతిలో బీజేపీ పెద్దల భావన ఉంది.
దీంతో పవన్కు ఇప్పుడు సంకటం ఏర్పడింది. నిజానికి ఆయన ఈ నెల 30న పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో రెండు రోజుల పాటు జరిగే.. కార్యక్రమంలో కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయాలని పవన్ భావించారు. అయితే.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలు .. కొన్ని కీలక విషయాల్లో చేసిన సూచనలతో పవన్ కు సంకట పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. అంటే.. ఆయన దూకుడు.. పెరగకపోగా.. తగ్గుందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…