Political News

రైతుల పాద‌యాత్ర‌ పై ఏపీ స‌ర్కారు వితండ వాద‌న‌

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం స‌హా ఇక్క‌డ భూములు ఇచ్చిన రైతుల విష‌యంలో వైసీపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న ధోర‌ణి ఆద్యంతం వివాదంగానే మారుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా వారి పాద‌యాత్ర‌పై ఎంపీలు, మంత్రులే వ్యాఖ్య‌లు, భౌతిక దాడులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా రైతుల పాద‌యాత్ర‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది ఏపీ స‌ర్కారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును కోరింది.

అయితే త‌మ పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వ అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు పాల్గొనడం కష్టమని రొటేట్‌ అవుతుంటారని రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిం చారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే గ్రామస్థులు ఉంటారని చెప్పారు. సంఘీభావం తెలిపేవాళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని చెప్పారు.

రైతులకు సంఘీభావం తెలిపేవారు భోజనాల ఏర్పాటు, వసతి కల్పించడం, విరాళాలు అందించడం చేస్తుంటారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారన్నారు.

అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు సమయం కావాలని కోరారు. పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది.

This post was last modified on October 28, 2022 10:36 am

Share

Recent Posts

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

3 minutes ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

2 hours ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

5 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

5 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

5 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

6 hours ago