రాజధాని అమరావతి నిర్మాణం సహా ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల విషయంలో వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ధోరణి ఆద్యంతం వివాదంగానే మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా వారి పాదయాత్రపై ఎంపీలు, మంత్రులే వ్యాఖ్యలు, భౌతిక దాడులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా రైతుల పాదయాత్రను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును కోరింది.
అయితే తమ పాదయాత్రకు ప్రభుత్వ అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు పాల్గొనడం కష్టమని రొటేట్ అవుతుంటారని రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిం చారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే గ్రామస్థులు ఉంటారని చెప్పారు. సంఘీభావం తెలిపేవాళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని చెప్పారు.
రైతులకు సంఘీభావం తెలిపేవారు భోజనాల ఏర్పాటు, వసతి కల్పించడం, విరాళాలు అందించడం చేస్తుంటారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్ హాల్కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారన్నారు.
అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు సమయం కావాలని కోరారు. పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది.
This post was last modified on October 28, 2022 10:36 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…