నా స్టోరీ చెప్పాలంటే తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత…అని ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర చెప్పాలన్నా… ప్రత్యేక తెలంగాణా ఇవ్వక ముందు…ఇచ్చిన తర్వాత అని చాలాకాలంగా సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్….కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని చాలామందిని టీఆర్ ఎస్ వైపునకు తిప్పుకొని కాంగ్రెస్ ను బలహీనం చేశారు. కాంగ్రెస్ కు చిరాకు తెప్పించే పనులన్నీ చేస్తోన్న కేసీఆర్ ….ఇటీవల పీవీ జయంతి ఉత్సవాలను జరిపి పీవీ, కాంగ్రెస్ అభిమానుల మెప్పు పొందారు.
ఇక తాజాగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని సిద్ధం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా పీవీ కూతురును గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారన్న టాక్ కాంగ్రెస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ కూతురు వాణితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ పదవి గురించి వాణి, కేసీఆర్ ల మధ్య చర్చ జరిగిందిని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ కోటాలో వాణికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు ఫిక్స్ అయ్యారని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆషాఢం తర్వాత ఈ వ్యవహారం చక్కబెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తోంది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 2 స్థానాలు గవర్నర్ కోటాలో ఖాళీ కాగా, త్వరలోనే మరోటి కాబోతోంది. ఆ మూడింటిలో ఒకటి నాయని నరసింహారెడ్డికి ఫిక్స్ అయిందట.
వచ్చే నెలలో పదవీకాలం పూర్తి కావచ్చిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కే మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారట. రాములు నాయక్ పై అనర్హత వేటు పడటంతో ఆ స్థానంలో వాణికి చాన్స్ ఇచ్చేందుకు సార్ సిద్ధమవుతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఒకవేళ, ఊహాగానాలు నిజమై వాణికి ఎమ్మెల్సీ పదవి దక్కితే…కాంగ్రెస్ ను మరోసారి కేసీఆర్ ఇరకాటంలో పడేసినట్లే.
This post was last modified on July 10, 2020 4:53 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…