రూ.400 కోట్లను నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చి.. వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని.. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి.. పోలీసులు కూడా.. దాడులు చేసి.. మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం.. రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దీనికి మూలాలు ఢిల్లీలో ఉన్నాయని అంటున్నారు.
ఈ ఘటనపై బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు.ఈ ఫామ్హౌజ్ అంశంపై ఆసాంతం ఆయన కామెడీగా మాట్లాడడం గమనార్హం. “టీఆర్ఎస్ ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారు. ఫామ్హౌజ్లో ఉన్నవాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారు? ఫామ్హజ్ వాళ్లదే(టీఆర్ఎస్), ఫిర్యాదు చేసింది వాళ్లే. ఒక మంత్రి పై హత్యాయత్నం జరిగిందని గతంలోనూ డ్రామా ఆడారు. బేరసారాలకు ఎక్కడైనా స్వామీజీలు వెళ్తారా? హిందూ ధర్మం అంటే కేసీఆర్కు ఎందుకంత కోపం? ఈ ఘటన పై మూడు రోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర చేశారు” అని ఎదురు దాడి చేశారు.
అంతేకాదు… “నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్కు ఎలా వెళ్తారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే ఈ నాటకమాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం. కేసీఆర్ నాటకమంతా త్వరలోనే బయటపడుతుంది. ఈ నాటకమంతా త్వరలోనే కేసీఆర్ మెడకే చుట్టుకుంటుంది. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు కేసీఆర్ కుట్రపన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకే స్వామిజీని ఇరికించారు. టీఆర్ఎస్ ఆరోపణల పై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. ఫామ్హౌజ్ అడ్డగా గుట్కా వ్యాపారం నడుస్తోంది” అని బండి సంజయ్ విమర్శించారు.
డీకే ఫైర్…
ఫామ్ హౌజ్ ఎపిసోడ్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెర తీశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ వ్యక్తులంటూ కొత్త కథ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ ఎస్ ఓడిపోతుందనే కేసీఆర్ ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…