మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేసిన వీరంగంతో.. భక్తులు నానా తిప్పలు పడ్డారు. అందునా.. సూర్యగ్రహణం రోజు ఎంతో ఆశ పెట్టుకుని శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన వందల మంది భక్తులు.. మంత్రి అనుచరులు చేసిన.. అరాచకంతో.. ఇబ్బందులు పడడమే కాకుండా.. తీవ్ర మనోవేదనకుకూడా.. గురయ్యారు. “ఎంత మంత్రి అయితే.. మాత్రం .. అని మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మంగళవారం.. సూర్యగ్రహణం అన్న సంగతి తెలిసిందే. దీనిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆలయాలు.. మూసివేశారు. అయితే.. ఒక్క శ్రీకాలహస్తిలో మాత్రం..గ్రహణ సమయంలోనూ.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే.. గ్రహాలకు అధిపతి అయినా.. శివయ్యను..ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరుని పూజించడం ద్వారా.. తమ జీవితంలో ఎదురవుతున్న గ్రహ దోషాలను తొలగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో మంగళవారం.. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు.. శ్రీకాళహస్తికి వచ్చారు. అయితే.. అదేసమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి.. కొడుకులు, కోడళ్లు.. మనవలు, ఇతర బంధువులతో వచ్చారు.
దీంతో ఆయనకు ఆలయ అధికారులు సహా.. స్థానిక ఎమ్మెల్యే.. బుయ్యపు మధుసూదన రెడ్డి..రెడ్ కార్పెట్ పరిచి మరీ.. స్వాగతాలు పలికారు. దీనిని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు. క్యూలైన్లలో ఉన్న భక్తులనుఇబ్బంది పెట్టడమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. మంత్రి కుటుంబీకులను అమ్మవారి అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా బీభత్సం సృష్టించారు. భక్తులను పక్కకు జరుపుతున్న క్రమంలో.. పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై తిరగబడ్డారు.
వైసీపీ నేతలు, పోలీసులు కలిసి వారిని తోసేయడంతో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు భక్తులు వాగ్వాదానికి దిగడం, దీంతో పరస్పరం వాదులాడుకోవడంతో.. సామాన్య భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దిరెడ్డి కుటుంబీకులు, వీవీఐపీల అభిషేకం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దీనివెనుక పెద్దిరెడ్డి శిష్యుడు.. శ్రీకాళహస్తి.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీంతో గ్రహణ సమయంలో పూజలు చేయించుకుని.. కష్టాల నుంచి బయటపడాలని వచ్చిన భక్తులకు.. కొత్త కష్టాలు రావడం.. చోద్యంగా మారింది.
This post was last modified on October 26, 2022 1:37 pm
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…