మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేసిన వీరంగంతో.. భక్తులు నానా తిప్పలు పడ్డారు. అందునా.. సూర్యగ్రహణం రోజు ఎంతో ఆశ పెట్టుకుని శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన వందల మంది భక్తులు.. మంత్రి అనుచరులు చేసిన.. అరాచకంతో.. ఇబ్బందులు పడడమే కాకుండా.. తీవ్ర మనోవేదనకుకూడా.. గురయ్యారు. “ఎంత మంత్రి అయితే.. మాత్రం .. అని మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మంగళవారం.. సూర్యగ్రహణం అన్న సంగతి తెలిసిందే. దీనిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆలయాలు.. మూసివేశారు. అయితే.. ఒక్క శ్రీకాలహస్తిలో మాత్రం..గ్రహణ సమయంలోనూ.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే.. గ్రహాలకు అధిపతి అయినా.. శివయ్యను..ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరుని పూజించడం ద్వారా.. తమ జీవితంలో ఎదురవుతున్న గ్రహ దోషాలను తొలగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో మంగళవారం.. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు.. శ్రీకాళహస్తికి వచ్చారు. అయితే.. అదేసమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి.. కొడుకులు, కోడళ్లు.. మనవలు, ఇతర బంధువులతో వచ్చారు.
దీంతో ఆయనకు ఆలయ అధికారులు సహా.. స్థానిక ఎమ్మెల్యే.. బుయ్యపు మధుసూదన రెడ్డి..రెడ్ కార్పెట్ పరిచి మరీ.. స్వాగతాలు పలికారు. దీనిని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు. క్యూలైన్లలో ఉన్న భక్తులనుఇబ్బంది పెట్టడమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. మంత్రి కుటుంబీకులను అమ్మవారి అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా బీభత్సం సృష్టించారు. భక్తులను పక్కకు జరుపుతున్న క్రమంలో.. పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై తిరగబడ్డారు.
వైసీపీ నేతలు, పోలీసులు కలిసి వారిని తోసేయడంతో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు భక్తులు వాగ్వాదానికి దిగడం, దీంతో పరస్పరం వాదులాడుకోవడంతో.. సామాన్య భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దిరెడ్డి కుటుంబీకులు, వీవీఐపీల అభిషేకం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దీనివెనుక పెద్దిరెడ్డి శిష్యుడు.. శ్రీకాళహస్తి.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీంతో గ్రహణ సమయంలో పూజలు చేయించుకుని.. కష్టాల నుంచి బయటపడాలని వచ్చిన భక్తులకు.. కొత్త కష్టాలు రావడం.. చోద్యంగా మారింది.
This post was last modified on October 26, 2022 1:37 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…