మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేసిన వీరంగంతో.. భక్తులు నానా తిప్పలు పడ్డారు. అందునా.. సూర్యగ్రహణం రోజు ఎంతో ఆశ పెట్టుకుని శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన వందల మంది భక్తులు.. మంత్రి అనుచరులు చేసిన.. అరాచకంతో.. ఇబ్బందులు పడడమే కాకుండా.. తీవ్ర మనోవేదనకుకూడా.. గురయ్యారు. “ఎంత మంత్రి అయితే.. మాత్రం .. అని మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మంగళవారం.. సూర్యగ్రహణం అన్న సంగతి తెలిసిందే. దీనిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆలయాలు.. మూసివేశారు. అయితే.. ఒక్క శ్రీకాలహస్తిలో మాత్రం..గ్రహణ సమయంలోనూ.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే.. గ్రహాలకు అధిపతి అయినా.. శివయ్యను..ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరుని పూజించడం ద్వారా.. తమ జీవితంలో ఎదురవుతున్న గ్రహ దోషాలను తొలగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో మంగళవారం.. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు.. శ్రీకాళహస్తికి వచ్చారు. అయితే.. అదేసమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి.. కొడుకులు, కోడళ్లు.. మనవలు, ఇతర బంధువులతో వచ్చారు.
దీంతో ఆయనకు ఆలయ అధికారులు సహా.. స్థానిక ఎమ్మెల్యే.. బుయ్యపు మధుసూదన రెడ్డి..రెడ్ కార్పెట్ పరిచి మరీ.. స్వాగతాలు పలికారు. దీనిని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు. క్యూలైన్లలో ఉన్న భక్తులనుఇబ్బంది పెట్టడమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. మంత్రి కుటుంబీకులను అమ్మవారి అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా బీభత్సం సృష్టించారు. భక్తులను పక్కకు జరుపుతున్న క్రమంలో.. పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై తిరగబడ్డారు.
వైసీపీ నేతలు, పోలీసులు కలిసి వారిని తోసేయడంతో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు భక్తులు వాగ్వాదానికి దిగడం, దీంతో పరస్పరం వాదులాడుకోవడంతో.. సామాన్య భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దిరెడ్డి కుటుంబీకులు, వీవీఐపీల అభిషేకం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దీనివెనుక పెద్దిరెడ్డి శిష్యుడు.. శ్రీకాళహస్తి.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీంతో గ్రహణ సమయంలో పూజలు చేయించుకుని.. కష్టాల నుంచి బయటపడాలని వచ్చిన భక్తులకు.. కొత్త కష్టాలు రావడం.. చోద్యంగా మారింది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…