తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు.. కేటీఆర్ సహజంగా.. ఏపీలోని లోపాలను ఎత్తి చూపేందుకు.. ప్రాదాన్యం ఇచ్చే విషయం తెలిసిందే. గతంలో తన స్నేహితులు.. ఏపీలో ఉన్నారని.. వారు అక్కడి రోడ్ల దుస్థితిని తనకు చెప్పారని.. కేటీఆర్ వ్యాఖ్యానించి.. రాజకీయంగా మంటలు రేపారు. అయితే.. తర్వాత.. తను ఆ ఉద్దేశంతో అనలేదంటూ.. వ్యాఖ్యానించారు. సరే.. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయింది. అయితే.. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడారు. అదేంటి అనుకుంటున్నారా? నిజమే. ఎప్పుడూ.. ఇప్పటి వరకు అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇతర మంత్రులు కానీ.. అమరావతి గురించి మాట్లాడలేదు.
అయితే..తాజాగా.. కేటీఆర్ మాత్రం అమరావతి గురించి మాట్లాడారు. బీజేపీని దుయ్యబడుతూ.. ఆయన వ్యాఖ్యలు చేస్తూ.. మధ్యలో అమరావతి ప్రస్తావన తెచ్చారు. దేశంకోసం, ధర్మం కోసం అనే బీజేపి… యాదాద్రికి వంద రూపాయలివ్వదు, అమరావతికి తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ళు ఇవ్వదు. మీరా హిందుత్వం గురించి, దేశం గురించి మాట్లాడేది….?? అని కేటీఆర్ సూటి ప్రశ్న సంధించారు. అంతేకాదు.. మోడీ తెలంగాణకు అనేక పథకాలు ప్రకటించారని.. అయితే.. ఒక్కటికూడా సాధించలేని వారు ఇప్పుడు ఓట్ల కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారని.. ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ప్రజలు నమ్మరని చెప్పారు.
అయితే.. కేటీఆర్ అమరావతి వ్యాఖ్య వెనుక.. చాలా వ్యూహం ఉండే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. మునుగోడులోని ఓటర్లను తమవైపు తిప్పుకోవడంతో పాటు.. సెటిలర్లను కూడా.. తమవైపు మలుచుకునే వ్యూహం ఉందనే భావన వ్యక్తమవుతోంది. లేక పోతే.. ఆకస్మికంగా.. ఇంత హఠాత్తుగా.. కేటీఆర్ నోటి నుంచి ఇలా అమరావతి సింపతీ వ్యాఖ్యలు ఎందుకు వస్తాయని.. అంటున్నారు. రాజధాని రైతులు.. రోజుల తరబడి పాదయాత్ర చేసి.. పోలీసులతో దెబ్బలు తిన్నప్పుడు కూడా.. ఇలా కేటీఆర్ స్పందించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. అమరావతిపై కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
This post was last modified on October 26, 2022 8:29 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…