బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రుషి సునాక్ కు చాలా సవాళ్ళు ఎదురుకానున్నాయి. అన్నింటిలోను అతిపెద్ద సవాలు ఏమిటంటే దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించటం. ఎందుకంటే ఆర్ధిక సమస్యల నుండి దేశాన్ని గట్టెక్కించటంలో మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ వేసిన ప్రణాళికలు ఫెయిలైన విషయం తెలిసిందే. తన ప్లాన్లు ఫెయిలైన కారణంగానే ట్రస్ కేవలం 45 రోజుల్లోనే పదవి నుంచి దిగిపోయారు.
ఇక్కడ సునాక్ ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే రాబోయే ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని ఆదుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే ఆందోళన పెరిగిపోతోంది. ఆర్థికమాంద్యం ఆందోళన చాలాదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పదులసంఖ్యలో అతిపెద్ద కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఇదేదారిలో ఇంకా చాలాకంపెనీలు నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరిగిపోతోంది.
సో ఆర్ధికమాంధ్యం, నిరుద్యోగం కారణంగా సమాజంపై పడే ప్రభావం అన్నీ ఒకదానితో మరొకటి లింకులున్న అంశాలు. గతంలో ఒకసారి ఆర్ధికమాంధ్యం ఎదురైనపుడు చాలా దేశాలు కుప్పకూలిపోయాయి. ఇపుడు కూడా అలాంటి ప్రమాదాన్నే ప్రపంచం అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కొన్నిదేశాల్లో మాంధ్యం ముప్పు ప్రభావం కనబడుతోందని నిపుణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సునాక్ తీసుకోబోయే ప్రతి నిర్ణయమూ బ్రిటన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయనటంలో సందేహంలేదు.
అందుకనే ప్రధాని బాధ్యతలు సునాక్ కు అంత తేలిక కాదు. దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించడమే తన ముందున్న అతిపెద్ద ప్రాధాన్యతగా సునాక్ చెప్పారు. గతంలో ఎదురైన మాంధ్యం కారణంగా అప్పట్లో చాలాదేశాలతో పాటు బ్రిటన్ కూడా బాగా ఇబ్బందిపడింది. అలాంటి ముప్పే తొందరలోనే ప్రపంచాన్ని ముంచేయబోతున్నట్లు సూచనలు కనబడుతున్న సమయంలో సునాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. నిజానికి మనదగ్గర తీసుకున్నట్లు ఏకవ్యక్తి నిర్ణయాలు బ్రిటన్లో చెల్లుబాటు కావు. ముందు సలహాదారులు అంగీకరించాలి, తర్వాత పార్లమెంటు ఆమోదించాలి, అంతిమంగా రాజముద్ర పడాలి. తన ప్రయత్నాల్లో సునాక్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
This post was last modified on October 25, 2022 4:54 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…