Political News

ధ‌ర్మాన రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ అయ్యారా…!

ఏ మంత్రికైనా.. ప్ర‌ధాన ల‌క్ష్యం.. త‌ను చూస్తున్న శాఖ‌ను బలోపేతం చేయ‌డం దాని ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించ‌డమే. ఈ విష‌యంలో రెండో మాట ఉండ‌దు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్ర‌జా ఉద్య‌మాల‌కు వ‌స్తున్నారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. గ‌ళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు చేస్తున్నారా? లేక‌.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్ర‌మంలో చేస్తున్న ఉద్య‌మాలో తెలియ‌దు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ముందున్నారు.

మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. ఆయ‌న చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని.. ఆయ‌న స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆయ‌నే తెలిపారు. అయితే.. దీనికి జ‌గ‌న్ వ‌ద్ద‌న్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన‌.. స్థానికంగా.. ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న మేధావి వ‌ర్గాల‌ను ఈ దిశ‌గా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేధావుల‌ ఫోర‌మ్‌ను కూడా.. ఏర్పాటు చేశారు. పైకి.. ధ‌ర్మాన ప్ర‌మేయం ఏమీ లేక‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నారు.

అయితే.. దీనిని ఏర్పాటు అయితే.. చేశారు త‌ప్ప‌.. దీనిని బ‌లోపేతం చేయ‌లేక పోయారు. మేధావులు భారీ సంఖ్య‌లో వ‌చ్చి చేర‌తార‌ని.. త‌న‌కు .. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని.. మంత్రిధ‌ర్మాన భావించారు. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర‌లో మేధావుల‌కు ఢోకాలేదు. వీరి సంఖ్య బాగానే ఉంది. గ‌తంలోనూ.. అనేక ఉద్య‌మాల్లో వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి ఏపీని ఉంచాల‌ని సాగించిన పోరాటంలో వారే ముందున్నారు. అయితే.. ఇప్పుడు.. మాత్రం మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వారు గ‌ళం వినిపించ‌డం లేదు.

మ‌రి.. వారు విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డం ఇష్టం లేక ముందుకు రావడం లేదో.. లేక‌.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. మేధావి వ‌ర్గాలు మాత్రం ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ధ‌ర్మాన వేసిన ఎత్తుగ‌డ పార‌డం లేదు. ఇప్ప‌టికే.. ఏయూ ప్రొఫెస‌ర్లు.. విజ‌య‌న‌గ‌రం క‌ళాశాల అధ్యాప‌కులకు కూడా ధ‌ర్మాన క‌బురు పెట్టారు. కానీ, వారు మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ధ‌ర్మాన‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌తగిలింద‌ని అంటున్నారు స్థానికులు. మ‌రి ఈ వ్యూహానికి బ‌దులుగా ధ‌ర్మాన ఎలాంటి మార్గం ఎంచుకుంటారో చూడాలి.

This post was last modified on October 25, 2022 8:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

5 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

9 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

39 minutes ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

55 minutes ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

57 minutes ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

2 hours ago