Political News

ధ‌ర్మాన రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ అయ్యారా…!

ఏ మంత్రికైనా.. ప్ర‌ధాన ల‌క్ష్యం.. త‌ను చూస్తున్న శాఖ‌ను బలోపేతం చేయ‌డం దాని ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించ‌డమే. ఈ విష‌యంలో రెండో మాట ఉండ‌దు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్ర‌జా ఉద్య‌మాల‌కు వ‌స్తున్నారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. గ‌ళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు చేస్తున్నారా? లేక‌.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్ర‌మంలో చేస్తున్న ఉద్య‌మాలో తెలియ‌దు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ముందున్నారు.

మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. ఆయ‌న చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని.. ఆయ‌న స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆయ‌నే తెలిపారు. అయితే.. దీనికి జ‌గ‌న్ వ‌ద్ద‌న్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన‌.. స్థానికంగా.. ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న మేధావి వ‌ర్గాల‌ను ఈ దిశ‌గా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేధావుల‌ ఫోర‌మ్‌ను కూడా.. ఏర్పాటు చేశారు. పైకి.. ధ‌ర్మాన ప్ర‌మేయం ఏమీ లేక‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నారు.

అయితే.. దీనిని ఏర్పాటు అయితే.. చేశారు త‌ప్ప‌.. దీనిని బ‌లోపేతం చేయ‌లేక పోయారు. మేధావులు భారీ సంఖ్య‌లో వ‌చ్చి చేర‌తార‌ని.. త‌న‌కు .. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని.. మంత్రిధ‌ర్మాన భావించారు. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర‌లో మేధావుల‌కు ఢోకాలేదు. వీరి సంఖ్య బాగానే ఉంది. గ‌తంలోనూ.. అనేక ఉద్య‌మాల్లో వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి ఏపీని ఉంచాల‌ని సాగించిన పోరాటంలో వారే ముందున్నారు. అయితే.. ఇప్పుడు.. మాత్రం మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వారు గ‌ళం వినిపించ‌డం లేదు.

మ‌రి.. వారు విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డం ఇష్టం లేక ముందుకు రావడం లేదో.. లేక‌.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. మేధావి వ‌ర్గాలు మాత్రం ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ధ‌ర్మాన వేసిన ఎత్తుగ‌డ పార‌డం లేదు. ఇప్ప‌టికే.. ఏయూ ప్రొఫెస‌ర్లు.. విజ‌య‌న‌గ‌రం క‌ళాశాల అధ్యాప‌కులకు కూడా ధ‌ర్మాన క‌బురు పెట్టారు. కానీ, వారు మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ధ‌ర్మాన‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌తగిలింద‌ని అంటున్నారు స్థానికులు. మ‌రి ఈ వ్యూహానికి బ‌దులుగా ధ‌ర్మాన ఎలాంటి మార్గం ఎంచుకుంటారో చూడాలి.

This post was last modified on October 25, 2022 8:18 am

Share

Recent Posts

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

2 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

3 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

11 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

12 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

12 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

16 hours ago