ఏ మంత్రికైనా.. ప్రధాన లక్ష్యం.. తను చూస్తున్న శాఖను బలోపేతం చేయడం దాని ద్వారా.. ప్రజలకు మరిన్ని సేవలు అందించడమే. ఈ విషయంలో రెండో మాట ఉండదు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్రజా ఉద్యమాలకు వస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానులకు అనుకూలంగా.. గళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచనల మేరకు చేస్తున్నారా? లేక.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్రమంలో చేస్తున్న ఉద్యమాలో తెలియదు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందున్నారు.
మూడు రాజధానులకు అనుకూలంగా.. ఆయన చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవసరమైతే.. తన పదవికి సైతం రాజీనామా సమర్పిస్తానని.. ఆయన స్వయంగా జగన్ చెప్పినట్టు ఆయనే తెలిపారు. అయితే.. దీనికి జగన్ వద్దన్నారని తెలిపారు. ఈ క్రమంలో మంత్రి ధర్మాన.. స్థానికంగా.. ఉత్తరాంధ్రలో ఉన్న మేధావి వర్గాలను ఈ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేధావుల ఫోరమ్ను కూడా.. ఏర్పాటు చేశారు. పైకి.. ధర్మాన ప్రమేయం ఏమీ లేకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఆయనే చక్రం తిప్పుతున్నారు.
అయితే.. దీనిని ఏర్పాటు అయితే.. చేశారు తప్ప.. దీనిని బలోపేతం చేయలేక పోయారు. మేధావులు భారీ సంఖ్యలో వచ్చి చేరతారని.. తనకు .. మూడు రాజధానులకు మద్దతుగా ఉంటారని.. మంత్రిధర్మాన భావించారు. ఎందుకంటే.. ఉత్తరాంధ్రలో మేధావులకు ఢోకాలేదు. వీరి సంఖ్య బాగానే ఉంది. గతంలోనూ.. అనేక ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఏపీని ఉంచాలని సాగించిన పోరాటంలో వారే ముందున్నారు. అయితే.. ఇప్పుడు.. మాత్రం మూడు రాజధానులకు అనుకూలంగా వారు గళం వినిపించడం లేదు.
మరి.. వారు విశాఖను రాజధాని చేయడం ఇష్టం లేక ముందుకు రావడం లేదో.. లేక.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ.. మేధావి వర్గాలు మాత్రం ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ధర్మాన వేసిన ఎత్తుగడ పారడం లేదు. ఇప్పటికే.. ఏయూ ప్రొఫెసర్లు.. విజయనగరం కళాశాల అధ్యాపకులకు కూడా ధర్మాన కబురు పెట్టారు. కానీ, వారు మాత్రం స్పందించడం లేదు. దీంతో ధర్మానకు గట్టి ఎదురు దెబ్బతగిలిందని అంటున్నారు స్థానికులు. మరి ఈ వ్యూహానికి బదులుగా ధర్మాన ఎలాంటి మార్గం ఎంచుకుంటారో చూడాలి.
This post was last modified on October 25, 2022 8:18 am
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…