Political News

ధ‌ర్మాన రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ అయ్యారా…!

ఏ మంత్రికైనా.. ప్ర‌ధాన ల‌క్ష్యం.. త‌ను చూస్తున్న శాఖ‌ను బలోపేతం చేయ‌డం దాని ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించ‌డమే. ఈ విష‌యంలో రెండో మాట ఉండ‌దు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్ర‌జా ఉద్య‌మాల‌కు వ‌స్తున్నారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. గ‌ళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు చేస్తున్నారా? లేక‌.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్ర‌మంలో చేస్తున్న ఉద్య‌మాలో తెలియ‌దు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ముందున్నారు.

మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. ఆయ‌న చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని.. ఆయ‌న స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆయ‌నే తెలిపారు. అయితే.. దీనికి జ‌గ‌న్ వ‌ద్ద‌న్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన‌.. స్థానికంగా.. ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న మేధావి వ‌ర్గాల‌ను ఈ దిశ‌గా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేధావుల‌ ఫోర‌మ్‌ను కూడా.. ఏర్పాటు చేశారు. పైకి.. ధ‌ర్మాన ప్ర‌మేయం ఏమీ లేక‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నారు.

అయితే.. దీనిని ఏర్పాటు అయితే.. చేశారు త‌ప్ప‌.. దీనిని బ‌లోపేతం చేయ‌లేక పోయారు. మేధావులు భారీ సంఖ్య‌లో వ‌చ్చి చేర‌తార‌ని.. త‌న‌కు .. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని.. మంత్రిధ‌ర్మాన భావించారు. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర‌లో మేధావుల‌కు ఢోకాలేదు. వీరి సంఖ్య బాగానే ఉంది. గ‌తంలోనూ.. అనేక ఉద్య‌మాల్లో వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి ఏపీని ఉంచాల‌ని సాగించిన పోరాటంలో వారే ముందున్నారు. అయితే.. ఇప్పుడు.. మాత్రం మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వారు గ‌ళం వినిపించ‌డం లేదు.

మ‌రి.. వారు విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డం ఇష్టం లేక ముందుకు రావడం లేదో.. లేక‌.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. మేధావి వ‌ర్గాలు మాత్రం ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ధ‌ర్మాన వేసిన ఎత్తుగ‌డ పార‌డం లేదు. ఇప్ప‌టికే.. ఏయూ ప్రొఫెస‌ర్లు.. విజ‌య‌న‌గ‌రం క‌ళాశాల అధ్యాప‌కులకు కూడా ధ‌ర్మాన క‌బురు పెట్టారు. కానీ, వారు మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ధ‌ర్మాన‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌తగిలింద‌ని అంటున్నారు స్థానికులు. మ‌రి ఈ వ్యూహానికి బ‌దులుగా ధ‌ర్మాన ఎలాంటి మార్గం ఎంచుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

39 minutes ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

44 minutes ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

46 minutes ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

1 hour ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

2 hours ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

3 hours ago