Political News

విశాఖకు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌దా? వైసీపీ ఎందుకు భ‌య‌ప‌డుతోంది?

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఇదే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వైసీపీ నేత‌లు త‌ప్ప‌.. విశాఖ‌ప‌ట్నం మ‌హానగ‌రంలో ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ‌కులు ఎవ‌రు అడుగు పెట్ట‌కూడ‌ద‌నేలా అధికార పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న వైనాన్ని మేధావులు సైతం త‌ప్పుప‌డుతున్నారు. ఇదేం చోద్యం.. ఇదే ప‌ద్ధతి? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో గ‌త ఏడాది కింద‌ట టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పర్య‌టించాల‌ని భావించారు. అయితే.. అప్ప‌ట్లోనూ ఆయ‌న‌ను విశాఖ విమానాశ్ర‌యం వ‌ద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు.

దీనిపై కోర్టులోనూ కేసులు న‌డిచాయి. అయినా.. స‌ర్కారు తీరు మార‌లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విశాఖ‌లో ప‌ర్య‌టించాల‌ని.. జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే.. ఆయ‌న‌ను కూడా అడ్డుకున్న‌ట్టుగానే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నారు. నిజానికి ఇలా ఎందుకు చేస్తున్నారో.. వైసీపీలోనూ.. చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని వైసీపీ అధిష్టానం నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో దీనికి వ్య‌తిరేకంగా వారు మాట్లాడ‌తార‌ని భ‌య‌ప‌డుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు మూడు రాజ‌ధానుల‌కు మొగ్గు చూపుతున్న వైసీపీ.. ఈ దిశ‌గా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేస్తామ‌ని చెబుతోంది. అయితే.. దీనికి సంబంధించి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌నుంచి అనుకున్న విధంగా జోష్ క‌నిపించ‌డం లేద‌నేది ఆ పార్టీ నేత‌ల్లోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేసినా.. మంత్రులు గ‌ర్జ‌న పేరుతో హ‌డావుడి చేసినా.. ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. విశాఖలో అడుగుపెట్టి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ఏమైనా వ్యాఖ్య‌లు చేస్తే.. అది త‌మ‌కు మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో కీల‌క పార్టీల నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే నేత‌ల‌ను అసలు.. విశాఖ‌లోకి అడుగు పెట్టకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఇది మంచి ప‌రిణామం కాద‌ని.. రేపు విశాఖ ప్ర‌జ‌ల్లో ఇదే వాద‌న బ‌ల‌ప‌డితే.. అది వైసీపీకి మొత్తానికి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago