Political News

విశాఖకు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌దా? వైసీపీ ఎందుకు భ‌య‌ప‌డుతోంది?

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఇదే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వైసీపీ నేత‌లు త‌ప్ప‌.. విశాఖ‌ప‌ట్నం మ‌హానగ‌రంలో ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ‌కులు ఎవ‌రు అడుగు పెట్ట‌కూడ‌ద‌నేలా అధికార పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న వైనాన్ని మేధావులు సైతం త‌ప్పుప‌డుతున్నారు. ఇదేం చోద్యం.. ఇదే ప‌ద్ధతి? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో గ‌త ఏడాది కింద‌ట టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పర్య‌టించాల‌ని భావించారు. అయితే.. అప్ప‌ట్లోనూ ఆయ‌న‌ను విశాఖ విమానాశ్ర‌యం వ‌ద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు.

దీనిపై కోర్టులోనూ కేసులు న‌డిచాయి. అయినా.. స‌ర్కారు తీరు మార‌లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విశాఖ‌లో ప‌ర్య‌టించాల‌ని.. జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే.. ఆయ‌న‌ను కూడా అడ్డుకున్న‌ట్టుగానే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నారు. నిజానికి ఇలా ఎందుకు చేస్తున్నారో.. వైసీపీలోనూ.. చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని వైసీపీ అధిష్టానం నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో దీనికి వ్య‌తిరేకంగా వారు మాట్లాడ‌తార‌ని భ‌య‌ప‌డుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు మూడు రాజ‌ధానుల‌కు మొగ్గు చూపుతున్న వైసీపీ.. ఈ దిశ‌గా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేస్తామ‌ని చెబుతోంది. అయితే.. దీనికి సంబంధించి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌నుంచి అనుకున్న విధంగా జోష్ క‌నిపించ‌డం లేద‌నేది ఆ పార్టీ నేత‌ల్లోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేసినా.. మంత్రులు గ‌ర్జ‌న పేరుతో హ‌డావుడి చేసినా.. ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. విశాఖలో అడుగుపెట్టి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ఏమైనా వ్యాఖ్య‌లు చేస్తే.. అది త‌మ‌కు మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో కీల‌క పార్టీల నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే నేత‌ల‌ను అసలు.. విశాఖ‌లోకి అడుగు పెట్టకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఇది మంచి ప‌రిణామం కాద‌ని.. రేపు విశాఖ ప్ర‌జ‌ల్లో ఇదే వాద‌న బ‌ల‌ప‌డితే.. అది వైసీపీకి మొత్తానికి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

This post was last modified on October 23, 2022 2:40 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

35 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago