మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. టీఆర్ ఎస్, బీజేపీలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి.. అక్కడి అభిమానులతో తన అంతరంగాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ఎన్నారై అభిమానులు.. కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. మనుగోడులో జరుగుతున్న ప్రచార తీరును అడిగి తెలుసుకున్నారు. అయితే.. వెంకటరెడ్డిమాత్రం తీవ్ర నిరుత్సాహంగా వ్యాఖ్యానించారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు వస్తాయేమో కానీ గెలిచే అవకాశాల్లేవని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మెల్బోర్న్లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో మునుగోడు ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై వెంకట్రెడ్డి ముచ్చటించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
నెటిజన్ల ఫైర్
కాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నెటిజన్లు.. వెంకటరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కూడుతిని కండలు పెంచుకున్న నాయకులు ఇలాగేనా మాట్లాడేది.. ? అని నిలదీస్తున్నారు. బలహీనంగా ఉన్నప్పుడే.. కదా.. నాయకులు కలసి కట్టుగా పనిచేసి.. బలవంతం చేయాలని.. అంటున్నారు. కీలకమైన సమయంలో దోబూచులాడుతూ.. పార్టీని నట్టేట ముంచుతున్న ఇలాంటి నాయకులకు పార్టీ అధిష్టానం తగిన విధంగా బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉంటే పదవులు అనుభవించేందుకు ముందుకు వస్తున్న నాయకులు.. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ.. అనేక గౌరవాలు పొందుతున్న వారు ఇలా వ్యాఖ్యానించి.. పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారని.. నిలదీస్తున్నారు.
This post was last modified on October 22, 2022 2:22 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…