Political News

మునుగోడులో టీడీపీ పది వేల ఓట్లు ఎవరి ఖాతాలో..!

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మహారంజుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్రుతం చేయబోతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. వీటికి తోడు చిన్న పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో అందరి చూపూ టీడీపీ, షర్మిల పార్టీలపై పడింది.

ఈ రెండు పార్టీలు పోటీలో లేకపోవడంతో వారి ఓట్లు ఎవరికి బదిలీ అవుతాయోననే టెన్షన్ అందరిలో నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉండడంతో షర్మిల పార్టీ పోటీలో ఉంటే గణనీయమైన ఓట్లే సాధించి ఉండేదని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె పార్టీ కొత్తది కావడం.. బరిలో లేకపోవడంతో బలంపై అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల రెడ్డికి ఆమెకు పరిచయాలు ఉండడం.. రెడ్డి కులస్థుల ఓట్లు చీలిపోకుండా చూసే ఉద్దేశంతో షర్మిల ఆయనకే లోపాయికారీ మద్దతు తెలుపుతోందని సమాచారం. ఎటొచ్చీ టీడీపీ పరిస్థితే గందరగోళంగా మారిందట. ఉప ఎన్నికలో పోటీకి దూరంగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడిపోయారట. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి సరైన మార్గనిర్దేశనం లేకపోవడంతో కార్యకర్తలు చౌరస్తాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంత లేదన్నా మునుగోడులో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల హవాలో ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవకపోయినా ప్రతీ ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన ఓట్లు సాధించేది. ఇప్పటికీ ఆ పార్టీకి నియోజకవర్గంలో సుమారు పది వేల ఓటు బ్యాంకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన జక్కలి ఐలయ్య యాదవ్ కు స్థానికంగా మంచి పేరే ఉంది. పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండేది.

ఇపుడు ఆ పరిస్థితి లేకపోవడంతో తాము ఎవరితో చేతులు కలపాలో తెలియక నేతలు సందిగ్ధంలో ఉన్నారట. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమ దూరంలో ఉన్న ఈ పార్టీ నేతల మద్దతుపై అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారట. అయితే.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీ వైపు కదులుతున్నందున ఆ పార్టీకే ఓట్లు బదలాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదే మరి. ఒకప్పుడు టీడీపీ కోసం బీజేపీ పని చేసింది. ఇపుడు అంతా రివర్స్ అయిపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారట. విధి అంటే ఇదే మరి.

This post was last modified on October 22, 2022 12:53 pm

Share
Show comments

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago