టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్తాపన చేసి 7 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామన్నారు. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది ప్రజల సంకల్పమని పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడని చంద్రబాబు విమర్శించారు. కోర్టులు చెప్పినా.. న్యాయ నిపుణులు చెప్పినా కూడా. ఈ ప్రభుత్వం మారడం లేదన్నారు. రాజధానిని కొనసాగించి ఉంటే.. ఇప్పటికే ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చి వుండేవని తెలిపారు.
రాజధానిని నిర్మించకపోగా.. దానిని అణిచి వేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని అన్నారు. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని, నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని…. అమరావతే గెలుస్తుందని…ఇదే ఫైనల్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…